ఆంధ్రప్రదేశ్ ఉపాధి మరియు శ్రామికుల శాఖ మాజీ మంత్రి టిడిపి నాయకుడు అచ్చెన్నాయుడు అత్యంత నాటకీయ రీతిలో నిన్నఅర్థరాత్రి దాటిన తరువాత శ్రీకాకుళం లోని తన నివాసంలో ఏసీబీ అధికారుల చేత అరెస్ట్ చేయబడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ విషయం పైన విపక్షాలు పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతుంటే అసలు ఏ ఆధారాలతో అచ్చెన్నాయుడు ని అరెస్ట్ చేశారు అని పలువురు ప్రశ్నించడం మొదలు పెట్టారు.
అందుకు సమాధానంగా ఇప్పుడు బయటకు వచ్చిన ఒక లెటర్ రాష్ట్ర రాజకీయాల్లో విపరీతమైన చర్చకు దారి తీసింది. అచ్చెన్నాయుడు మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన సంతకం చేసిన ఈ లెటర్ లో ఈఎస్ఐ ఆస్పతుల్లో ఈసిజి పరికరాలను మరియు డిస్పెన్సరీ ల కొనుగోలుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉంది. అలాగే తెలంగాణలో ఎన్నో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన ఇదే సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కి వచ్చినట్లు అందులో క్లియర్ గా పేర్కొన్నారు.
అంతేకాకుండా అదే ఫర్మ్ జతకట్టి అన్నీ ఈఎస్ఐ ఆస్పత్రిలో ఈసిజి సెంటర్లు మరియు డిస్పెన్సరీ లో ఏర్పాటు చేస్తున్నట్లు కూడా అందులో ఉంది. అచ్చెన్నాయుడు ని జైలుకు పంపించడానికి ఈ ఒక్క ఆధారం చాలు అంటున్నారు రాజకీయ నిపుణులు.