ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ లో ఇతనిని ప్రధాన నిందితుడిగా ఏసీబీ అధికారులు అర్ధరాత్రి అతని నివాసం లో అరెస్టు చేశారు. అయితే ఇప్పుడు మెల్లగా ఒక్కో పేరు బయటకు వస్తోంది.
అచ్చం నాయుడు తో పాటు ఏక కాలంలో తిరుపతిలో ఈఎస్ఐ డైరెక్టర్ రమేష్ ను కూడా అరెస్టు చేసిన అధికారులు తాజాగా రాజమండ్రికి చెందిన రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ సివిల్ సర్జన్ డాక్టర్ గాడి విజయ్ కుమార్ ను కూడా అరెస్టు చేశారు. ఈఎస్ఐ ఆస్పత్రి లో ఈసీజీ పరికరాలను మరియు ఇతర ల్యాబ్ పరికరాలను సమకూర్చే విషయంలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని నీ అచ్చెన్నాయుడు, రమేష్ లతో పాటు విజయకుమార్ పైన కూడా ఆరోపణలు వచ్చాయి.
ఇప్పుడు పక్కా ఆధారాలతో అధికారులు వీరిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఒక స్పెషల్ గ్రేడ్ సివిల్ సర్జన్ హెల్ప్ లేకుండా ఒక మంత్రి ఇదంతా చేయడం సాధ్యం అయ్యే పని కాదని ప్రజలు అనుకుంటున్నారు. టెండర్లు పిలవకుండా, బిల్లులు అధిక మొత్తానికి వేసి పరికరాల సమకూర్చడంతో ఇంత పెద్ద కుంభకోణం జరిగిందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఇంక తరువాత తరువాత ఎవరి పేర్లు బయటకు వస్తాయో వేచి చూడాలి.