ఈ మధ్యకాలంలో నటుడు సోనూసూద్ పేరు వినిపించినంతగా దేశంలో ఏ రాజకీయ నాయకుడి పేరు కానీ సెలబ్రిటీ పేరు కానీ వినిపించలేదు అంటే అతిశయోక్తి కాదు. తన సేవాభావం మరియు పరోపకార దృక్పథానికి దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ ఇప్పుడు సోనూసూద్ సొంతం. ఇప్పటికే కొన్ని వేల మందికి ఈ కరోనా సంక్షోభ సమయంలో సహాయం చేసిన సోనూ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక కుటుంబానికి ట్రాక్టర్ కొనిచ్చి ఆసరాగా నిలవడమే కాకుండా ఉద్యోగం కోల్పోయిన ఒక అమ్మాయి కి తిరిగి ఉద్యోగాన్ని ఇచ్చాడు.
సోనూసూద్ ఇప్పుడు మళ్లీ తెలంగాణలో ముగ్గురు పిల్లలకు జీవితాన్ని ఇవ్వడం చూసి ఇతను నిజంగానే కలియుగ దేవుడు అని నెటిజన్లు అంతా పొగిడేస్తున్నారు. వివరాల్లోకి వెళితే తెలంగాణ లోని భువనగిరి జిల్లా, యాదాద్రి లో ముగ్గురు అనాధ పిల్లలు ఉన్నారని వారిని కాపాడవలసిందిగా సోనుసూద్ ను ఒక ట్విట్టర్ యుజర్ కోరాడు. ఈ విషయం చాలామంది అనేక రీట్వీట్ల ద్వారా సోనూసూద్ వద్దకు చేర్చారు.
ఆ ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు లేరు. ఆ ముగ్గురిలో పెద్దవాడైన పిల్లోడు తన చెల్లి, తమ్ముడి ఆలనాపాలనా చూసుకుంటున్నాడు. ఇక ఈ విషయం సోనుసూద్ వద్దకు వేల రీట్వీట్ల ద్వారా చేరిన వెంటనే “ఇకపై వారు అనాథలు కారు.. వారు నా బాధ్యత” అని సోనుసూద్ వెంటనే ట్వీట్ వేయడం గమనార్హం.
They are no longer orphans.
They will be my responsibility ❣️ https://t.co/pT0hQd4nCx— sonu sood (@SonuSood) July 31, 2020
ఇక్కడ విశేషం ఏమిటంటే ఎంతో మంది టాలీవుడ్ సెలబ్రిటీలు, హీరోలు మరియు తెలంగాణ రాజకీయ నాయకులు ఉన్నా కూడా ప్రజలు సోనుసూద్ కే నిటిజన్లు ఇలాంటి విషయాన్ని తెలియజేయడం మరియు వెంటనే సోనూసూద్ స్పందించి తనకు సంబంధం లేని పిల్లలను జీవితాంతం పోషించి, కష్ట సుఖాలను చూసే ఒక తండ్రిలా అండగా ఉంటాను అని చెప్పడం ఎంతో గొప్ప విషయం. ఈ వ్యక్తిత్వం ఎంత మందికి సాధ్యం చెప్పండి.