Supreme Court: సోషల్ మీడియాల్లో విమర్శలు చేసే ప్రతి ఒక్కరినీ జైలుకు పంపడం సరికాదని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పై విమర్శలు చేశాడన్న ఆరోపణలతో అరెస్టయిన ఓ యూట్యూబర్ కు సుప్రీం కోర్టు బెయిల్ ను పునరుద్దరించింది. ఈ సందర్భంగా తమిళనాడు సర్కార్ పై సుప్రీం ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
వివరాల్లోకి వెళితే.. సీఎం స్టాలిన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో తమిళనాడుకు చెందిన యూట్యూబర్ దురై మురుగన్ ను 2021 అక్టోబర్ నెలలో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతనికి బెయిల్ మంజూరైంది. అయితే న్యాయస్థానం ఇచ్చిన స్వేచ్చను దుర్వినియోగం చేశాడన్న కారణంగా 2022 లో మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ అతని బెయిల్ ను రద్దు చేసింది.
దీంతో మురుగన్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. మద్యంతర బెయిల్ లభించింది. అప్పటి నుండి అతను బయటే ఉన్నాడు. ఈ క్రమంలోనే రెగ్యులర్ బెయిల్ రద్దును సవాల్ చేస్తూ యూట్యూబర్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంలో తమిళనాడు సర్కార్ పై ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది.
యూట్యూబ్ లో విమర్శలు చేసే ప్రతి ఒక్కరినీ అరెస్టు చేసుకుంటూపోతే .. ఎన్నికల ముందు ఎంత మందిని జైల్ లో పెడతారు అని ప్రశ్నించింది. కోర్టు ఇచ్చిన స్వేచ్చను అతను దుర్వినియోగం చేసినట్లు ఎలాంటి సాక్ష్యాలు లేవని తెలిపింది. అందువల్ల అతనికి రెగ్యులర్ బెయిల్ ను పునరుద్దరిస్తూ తీర్పు వెల్లడించింది.
AP CID: తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద హెరిటేజ్ పత్రాలు దగ్ధం .. టీడీపీ నేతలు ఏమంటున్నారంటే ..?