బ్రిటన్ దేశం లో బయటపడ్డ కొత్తరకం కరోనా స్ట్రెయిన్ దెబ్బకి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా వైరస్ కంటే వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ దేశం నుండి విమాన రాకపోకలు అన్ని దేశాలు ఆపేశాయి. కరోనా వచ్చిన ప్రారంభంలో యూరప్ దేశాలు భారీ స్థాయిలో మూల్యం చెల్లించుకున్న సంగతి తెలిసిందే. ఆర్థికంగా చాలా దేశాలు నష్టపోయాయి.
బ్రిటన్ నుండి ఎవరైతే ఇతర దేశాలకు రాకపోకలు చేశారో వారందరి విషయంలో ఆయా దేశాలు జాగ్రత్త వహిస్తూ టెస్టులు చేస్తున్నాయి. ఇండియాలో కూడా ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చిన వాళ్ల వివరాలు సేకరిస్తూ జాగ్రత్తలు వహిస్తోంది. ఈ క్రమంలో అధికారులు కొంతమందికి కొత్తరకం కరోనా ఉన్నట్లు గుర్తించినట్లు వారి వివరాలను సేకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కరోనా పాజిటివ్ వస్తే హాస్పిటల్ క్వారంటైన్ లోకి, లక్షణాలు లేకపోతే హోటల్ క్వారంటైన్ లో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో కరోనా కొత్త రకం కట్టడి చేసేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రారంభించారు. అంతమాత్రమే కాకుండా సదరు వ్యక్తి లో బయటపడే వైరస్ కొత్త రకం కాదా అవునా అని తేల్చేందుకు నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కి పంపిస్తున్నారు. అంత మాత్రమే గాక గత రెండు వారాల నుండి బ్రిటన్ నుండి భారత్ కి వచ్చిన వారి వివరాలు సేకరిస్తూ వాళ్ళని కూడా పరీక్ష చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఇదిలా ఉంటే కరోనా దెబ్బకు చాలా నష్టపోయిన యూరప్ దేశాలు ఈ కొత్త రకం కరోనా వైరస్ ఎఫెక్ట్ కి మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లి పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.