సరిగ్గా కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం నుండి త్వరలోనే కరోనా వ్యాక్సిన్ రాబోతోందని అందుకు సంబంధించిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చారు. వ్యాక్సిన్ ప్రక్రియను విజయవంతంగా మొదలు పెట్టేందుకు సమాయత్తం కావలసిందిగా ఆదేశించారు. అయితే పరిస్థితి ఒక్కసారిగా తారుమారు అయింది. బ్రిటన్ దేశం లో వెలుగుచూసిన కొత్తరకం వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలు తో పాటు భారత్ కు కూడా దడ పుట్టిస్తోంది. అందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే బ్రిటన్ నుండి ప్రపంచ దేశాలు రాకపోకలను నిషేధించాయి.
ఇక ఈ కొత్తరకం వైరస్ విషయానికి వస్తే మ్యూటెంట్ కరోనా వైరస్ గా చెప్పబడుతున్న దీనివల్ల ఎంతోమంది బ్రిటన్లో ఆసుపత్రి పాలయ్యారు. ఇక ఈ క్రమంలోనే భారత దేశంలో కూడా బ్రిటన్ విమానం నుండి వచ్చిన ఐదుగురికి వైరస్ సోకిందని వార్తలు వచ్చాయి. అది కూడా కొత్తరకం వైరస్ ను వారి శరీరంలో కనుగొన్నట్లు మీడియాలో హోరెత్తించారు. ఇక దీని గురించి కేంద్రం పైన తీవ్రమైన ఒత్తిడి మొదలైంది. వెంటనే బ్రిటన్ నుండి విమానాల రాకపోకలను భారత్ తాత్కాలికంగా నిషేధించింది. డిసెంబర్ 31 వరకు ఇవి అమలులో ఉంటాయని చెప్పేసింది.
ఇప్పుడు ఆ ఐదుగురి విషయానికి వస్తే…. కొత్త రకం వైరస్ భారతదేశంలో ఇంకా బయటపడలేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటన చేసింది. అంతేకాకుండా జిల్లా నిఘా అధికారులను గత నెల రోజులకు పైగా బ్రిటన్ నుండి బ్రిటన్ నుండి వచ్చిన ప్రయాణికులు అందరూ సంప్రదించాలని సూచించారు. విదేశాల నుండి వచ్చినవారి 14 రోజుల హిస్టరీ తీసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ను కోరింది. అంతేకాకుండా పాజిటివ్ వచ్చిన ప్రయాణికుల శాంపిల్స్ ను పూణేలోని ల్యాబ్ కు పంపి… నెగటివ్ వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులపాటు ఐసోలేషన్ లో ఉంచాలని సూచించింది.