Shanivarwada Fort: మన భారతదేశం చారిత్రక కట్టడాలకు అలాగే అలనాటి అద్భుతాలకు ప్రతీకగా పిలవబడుతుంది. భారతదేశంలో ఇటువంటి ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అలనాటి అద్భుతమైన కట్టడాలలో పుణె లోని బాజీరావు పేష్వా నిర్మించిన శనివర్వాడ కోట కూడా ఒకటి. కానీ, పౌర్ణమి రోజుల్లో ఆ కోట లోకి వెళ్లాలంటే చాలా గుండె ధైర్యం కావాలట. అక్కడి ప్రజలు పౌర్ణమి రోజుల్లో పర్యాటకులను కోట పరిసరాల్లోకి వెళ్లవద్దని హెచ్చరిస్తారట. స్థానికులు చెప్పే కథనాల ప్రకారం పౌర్ణమి రోజున అక్కడ ఏవేవో అరుపులు, ఆకారాలు తమకు కనిపిస్తుంటాయని చెబుతున్నారు.
బ్రిటీషు వారి దాడి కారణంగా ప్రస్తుతం ఆ కోటలో ఏవి మిగలలేదు. మరాఠా లో బాజీరావు మరణం తర్వాత అతని తనయుడు బాలాజీ బాజీరావు (నానా సాహెబ్) ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అయితే, ఈ నానా సాహెబ్కు ముగ్గురు కొడుకులు ఉన్నారు వారి పేర్లు, మాధవ్ రావు, విశ్వాస్ రావు, నారాయణ్ రావు. ఓ రోజు నానా సాహెబ్ యుద్ధంలో వీరమరణం పొందడంతో తర్వాత అతని కుమారుడు మాధవ్ రావు మరాఠా సామ్రాజ్య బాధ్యతలు చేపట్టాడు. మరో యుద్ధంలో అతని మొదటి తమ్ముడు విశ్వాస్ రావు చనిపోయారు. అయితే తమ్ముడి మరణాన్ని మాధవ్ రావు జీర్ణించుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
క్రీ.శ 1773 వ సంవత్సరం లో తండ్రి మరియు అన్నల మరణం తర్వాత చివరిగా నారాయణ రావు అనుభవం లేకపోయినా సామ్రాజ్య బాధ్యతలు చేపట్టాడు. అప్పటికి అతడికి కేవలం 16 ఏళ్లే కావడంతో అతడి బాబాయి రఘునాథ్ రావు సూచనలతో సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అయితే, దురాశతో రఘునాథ రావు కుట్ర వల్ల రాజుకి గార్దీ అనే గిరిజన జాతి ప్రజలతో విభేదాలు వచ్చాయి.
అయితే, బాబాయి సహకారంతో గిరిజనులు రహస్యంగా ఆ కోటలోకి ప్రవేశించి నారాయణ రావు ని హత్య చేశారు. ఆ తరువాత అతడిని సమీపంలోని ఓ నదిలో పడేశారు. ఇక అప్పటి నుంచి ప్రతి పౌర్ణమికి నారాయణ రావు ఆత్మ ఆ కోటలో ప్రతీకారం తీర్చుకోడానికి తిరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.