ప్రస్తుతం కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీజన్ 4 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అందరు కరోనా తో భయపడుతుంటే నాగ్ మాత్రం ధైర్యంగా వచ్చి బిగ్ బాస్ కోసం మేకప్ వేసుకున్నాడు. మొదటి ఎపిసోడ్ లోనే రెండు రకలా గెటప్ లతో అదరగొట్టాడు. అంతేకాదు అందరికంటే ముందే తన సినిమాని సెట్స్ మీదకి తీసుకు వచ్చాడు. ప్రస్తుతం చేస్తున్న వైల్డ్ డాగ్ సినిమా ఇటీవలే తిరిగి చిత్రీకరణ ప్రారంభమైంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అహిషోర్ సాల్మోన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో డేర్ డెవిల్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ నాగార్జున నటిస్తున్నారు.
కాగా తాజాగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలెండ్ డైరెక్టర్ మహి వి రాఘవ్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో నాగార్జున ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా వచ్చిన ‘యాత్ర’ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో మహి వి రాఘవ్ ‘యాత్ర 2’ను చేసేందుకు సిద్ధమవుతున్నట్టు ఇటీవల చెప్పుకొచ్చాడు. అలా చెప్పినప్పటి నుంచి ప్రేక్షకులంతా యాత్ర 2లో నటించే హీరో ఎవరు అని ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు.
కాగా తాజాగా యాత్ర 2లో వైయస్ జగన్ పాత్రలో స్టార్ హీరో నాగార్జున నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. జగన్ ప్రారంభించిన ఓదార్పు యాత్ర దగ్గర్నుండే యాత్ర 2 ప్రారంభంవుతుందని.. తమ అభిమాన నాయకుడి బయోపిక్ ను త్వరలోనే స్క్రీన్ మీద చూడొచ్చు అని దర్శకుడు వెల్లడించాడు. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో గాని జగన్ అభిమానులు కూడా యాత్ర 2 గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఇదే గనక నిజమైతే నాగార్జున ముఖ్యమంత్రిగా అద్భుతంగా ఆకట్టుకుంటాడు. అంతేకాదు ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాలు చేసిన నాగార్జున ఈ పాత్ర పోషిస్తే ఇక దాదాపు అన్నీ పాత్రలు చేసేసినట్టే అవుతుంది. మరి త్వరలో ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన వెలువడితే గాని ఒక క్లారిటీ వస్తుంది. ఇక నాగ్ బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర సినిమాలోను కీలక పాత్ర పోషిస్తున్నాడు.