వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ముందు నుండి ప్రతిపక్షాలు న్యాయస్థానాల ద్వారా అడ్డు పడుతున్నట్లు వైసీపీ నేతలు పేర్కొనటం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి ప్రభుత్వ అధికారులతో సమావేశమైన సందర్భంలో కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. ఒక మంచి పని చేస్తున్న సమయంలో దుష్టశక్తులు అడ్డుపడతారని కానీ చివరాకరికి సత్యమే గెలుస్తుందని ఎవరు నిరుత్సాహ పడకూడదు అని ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా కొన్ని ప్రాంతాలలో ఇళ్ల పట్టాల భూ పంపిణీ విషయంలో పొరపాటు లెక్కలు బయట పడినట్లు అవి జగన్ కి తలనొప్పిగా భవిష్యత్తులో మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే పాతిక లక్షల మందికి త్వరలో జగన్ సర్కార్ ఇళ్ల పట్టాల పంపిణీ చేయడం గ్యారెంటీ. పరిస్థితి ఇలా ఉండగా కొన్ని కొన్ని చోట్ల సర్వే భూములు మరియు లబ్ధిదారులకు పట్టాల పేర్లు తప్పులు పడినట్లు… పొరపాటు లెక్కల వల్ల అధికారుల పని లోపంవల్ల ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో కొద్దిగా డ్యామేజ్ జరిగినట్లు వార్తలు మీడియా సర్కిల్స్ లో ఏపీ పాలిటిక్స్ లో వస్తున్నాయి.
దీంతో ఈ వార్తలు విని ఇవి నిజంగా వాస్తవం అయితే ప్రభుత్వానికి ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు హయాంలో పూర్తయిన 10 లక్షల ఇళ్లు పంపిణీ చేయడం లేదని విపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయి. మరి ఇలాంటి తరుణంలో అవి పక్కనపెట్టి, కొత్తగా ఇచ్చే ఇళ్ల పట్టాల విషయంలో అవకతవకలు జరిగితే కచ్చితంగా సీఎం జగన్ కి ఈ విషయం పెద్ద తలనొప్పిగా మారడం గ్యారెంటీ అని మేధావులు విశ్లేషిస్తున్నారు.