టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం వద్ద విగ్రహం ధ్వంసం ఘటనపై వైసీపీ అధినేత జగన్ పై అదేవిధంగా మతాల పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడం అందరికీ తెలిసిందే. దీంతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రపంచశాంతి పార్టీ అధినాయకుడు కె ఏ పాల్ స్పందించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి పైగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇంత దిగజారి మరీ మాట్లాడతారని ఊహించలేదని పేర్కొన్నారు.
మతాల మధ్య గొడవలు పెట్టే రీతిలో చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని సీరియస్ అయ్యారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాల మాదిగల మధ్య గొడవ పెట్టి రాజకీయ పబ్బం గడిపారని, అంతకుముందు టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు సొంత మామ ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచారని ఇప్పుడు తన రాజకీయ పబ్బం గడుపు కోటానికి మతవిద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నట్లు పాల్ సీరియస్ అయ్యారు.
ప్రస్తుతం ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లే పరిస్థితి ఉండటంతో బిజెపి అదేవిధంగా హిందూ మత సంస్థల మన్ననలు పొందు కోవటానికి చంద్రబాబు ఆడుతున్న రాజకీయ డ్రామా అంటూ.. హిందూ విగ్రహ విధ్వంసంపై బాబు వ్యవహరిస్తున్న తీరుపై కె ఏ పాల్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తను అమెరికాలో ఉన్నాం అని గత రెండు సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్న, త్వరలో అమెరికా అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారం జరగబోతున్న దాని కి హాజరు కాబోతున్నట్లు అన్నట్టుగా కెఏ పాల్ చెప్పుకొచ్చారు. జనవరి నెల తర్వాత రాష్ట్రంలో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.