సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ ..14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ .. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహేష్ బాబు కెరీర్ లో రాబోయో 27 వ సినిమాగా రూపొందనున్న ఈ సినిమాకి గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు. గతంలో ఆగడు, బిజినెస్ మాన్ లాంటి సూపర్ హిట్ సినిమాలకి అద్భుతమైన ఆల్బం ఇచ్చిన థమన్ ఈ సారి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న రేంజ్ లో ట్యూన్స్ రెడీ చేస్తున్నాడట.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్దిక నేరస్థుడిగా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్, బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక భారీ బ్యాక్ సెట్ ని నిర్మించారట. నవంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్టు చెప్పుకుంటున్నారు.
కాగా ఈ సినిమాలో మహేష్ బాబు లాంగ్ హేయిర్ లో కనిపించబోతున్నాడు. ఈ మేకోవర్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కి బాగా నచ్చింది. అంతేకాదు ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాని గతంలో వచ్చిన పోకిరి సినిమాతో పోల్చుకుంటున్నారు. ఇక ఇక్కడ మహేష్ ఫ్యాన్స్ కి పెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే సర్కారు వారి పాట యూనివర్సల్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియన్ సినిమాగా రూపొందిస్తున్నారట. అందుకు తగ్గట్టుగా పరశురాం స్క్రిప్ట్ ని భారీ స్థాయిలో సిద్దం చేస్తున్నాడని సమాచారం. మొత్తానికి రాజమౌళి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా క్రేజ్ వస్తుందనుకున్న ఫ్యాన్స్ కి ముందే సర్కారు వారి పాట ఆ కోరిక తీర్చబోతుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!