Smell: ప్రతి పదిమందిలో ఏడుగురు బాధిస్తున్న సమస్య డయాబెటిస్.. ఒక్కసారి మందులు వాడాల్సిందే.. ఏమాత్రం అ జాగ్రత్తగా ఉన్నా తీవ్ర పరిణామలు తప్పవు.. షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకో లేకపోతే శరీరంలోని మిగతా అవయవాల పనితీరు దెబ్బతింటుంది.. ఈ మూడు రకాల శరీర దుర్వాసనల ఆధారంగా అధిక మధుమేహాన్ని గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు..!!
కిటో యాసిడోసిస్ అనేది డయాబెటిస్ కలిగించే ప్రాణాంతక దుష్ఫలితాలలో ముఖ్యమైనది .. రక్తంలో చక్కెరలను శక్తిగా మార్చుకునేందుకు శరీరానికి ఇన్సులిన్ సహాయపడుతుంది.. ఇన్సులిన్ తగినంత గా శరీరంలో లభ్యం కాకపోతే కాలేయం నుంచి కొవ్వును కరిగిస్తుంది.. ఈ ప్రక్రియలో అనేక ఆమ్లాలు విడుదలవుతాయి.. ఆ ఆమ్లాలనే కీటోన్లు అంటారు.. ఇవి రక్తంలో కలవడం వల్ల రక్తం యాసిడ్ మయంగా మారుతుంది.. అప్పుడు శరీరంలో మూడు రకాల దుర్వాసనలు ఉత్పన్నమవుతాయి.. శరీరంలో అధికంగా ఉన్న కీటోన్లు శ్వాస ద్వారా చెమట ద్వారా బయటికి వెళ్లిపోతాయి.. ఈ సమయంలోనే నోటి దుర్వాసన వస్తుంది.. ఇది మూడు రకాలుగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
పండ్లు తిన్నట్టుగా నోరు వాసన వస్తుంది.. చెడు శ్వాస మలాన్ని తపించేలా దుర్వాసన వస్తుంది.. దీర్ఘకాల వాంతులు, పేగుల్లో సమస్యలు ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అమ్మోనియా వంటి దాటైనా వాయువుల వాసన ఉంటుంది. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారిలో ఇలాంటి వాసన గుర్తించవచ్చు.. మూత్రం, రక్త పరీక్షల ద్వారానే కాకుండా పైన చెప్పుకున్న మూడు చెడు శ్వాస లక్షణాల ఆధారంగా కూడా హై బ్లడ్ షుగర్ ను గుర్తించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. వెంటనే వైద్యుల్ని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోండి..