`బింబిసార`, `కార్తికేయ 2`.. ఆగస్టు నెలలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన చిత్రాలు ఇవి. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా శ్రీ వశిష్ఠ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రమే `బింబిసార`. ఇందులో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతి బింబిసారుడు జీవిత కథ ఆధారంగా టైం ట్రావెల్ కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. టాక్ అనుకూలంగా ఉండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టి భారీ లాభాలను మిగిల్చింది. `కార్తికేయ 2` విషయానికి వస్తే.. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సస్పెన్స్ థ్రిల్లర్ ఇది.
పీపీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 13న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తాయా అని సినీ ప్రియులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ రెండు చిత్రాలు ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి. జీ5 వారు ఈ రెండు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సాలిడ్ ధరకు సొంతం చేసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద ఆల్మోస్ట్ `బింబిసార`, `కార్తికేయ 2` రన్ పూర్తి అవ్వడంతో.. జీ5 వారు ఈ రెండు చిత్రాలను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 30న `బింబిసార`, అక్టోబర్ 5న `కార్తికేయ 2`ను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!