పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న వకీల్ సబ్ సినిమా తో పాటు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తు బిజీ బిజీ గా ఉన్నారు. దిల్ రాజు మరియు బోనికపూర్ కలిసి నిర్మిస్తున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. అలాగే క్రిష్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుని తదుపరి షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నారు.
పవర్ స్టార్ మరియు వేణు శ్రీరామ్ ల కాంబినేషన్ తొలిసారిగా తెరకెక్కనుంది. ఇదొక కోర్టు డ్రామా మూవీ మరియు ఈ సినిమా లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా పవర్ స్టార్ వీటితో పాటుగా మరో మూడు సినిమాలు కూడా సైన్ చేసినట్లు సమాచారం. వాటిలో ఒకటి హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా కాగా మరొకటి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న సినిమా, అలానే సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో నాగవంశీ నిర్మించనున్న సినిమా.
త్వరలోనే ఈ మూడు సినిమాలు పట్టాలెక్కనున్నాయి. అయితే, ఈ మూడు సినిమాలలో ఒక సినిమాకి గాను కే జి ఎఫ్ మూవీ కి పని చేసిన ఫైట్ మాస్టర్స్ అన్బు, అరివు ని తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ పవన్ నటించబోయే ఈ మూడు సినిమాలలో ఏ సినిమాకి వారు పని చేస్తారు అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!