జగన్ అధికారంలోకి రాకముందు వరకూ అన్ని రకాల సామాజిక వర్గాల నాయకులు ఆయన చుట్టూ ఉన్నారని అప్పుడు జగన్ అందరివాడిగా కనిపించాడని, కాగా సీఎంగా పదవి చేపట్టాక కొందరి వాడుగా అయిపోయారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల వైసీపీ పార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి ఆ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులపై అవినీతి ఆరోపణలు చేసిన వైసీపీ ఎంపీ రఘు రామ కృష్ణంరాజు కూడా ఇదే రీతిలో రియాక్ట్ అవ్వడం జరిగింది. వైయస్ జగన్ చుట్టూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కోటరీ ఉందని, ఆయనను ఎవరూ కలవకుండా వాళ్లే అడ్డుకుంటున్నారని పేర్లు చెప్పకుండా పరోక్ష విమర్శలు చేయడం జరిగింది.
ఇదిలా ఉండగా ఇటీవల ముగ్గురు కీలక నాయకులకు పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్రంలో ప్రాంతాలను విభజన చేసి బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది. ఆ ముగ్గురు విజయసాయిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. విజయసాయిరెడ్డికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు అప్పగించారు. తన బంధువు వైవి సుబ్బారెడ్డి కి ఉభయగోదావరి కృష్ణా, గుంటూరు జిల్లాలను ప్రసాదించారు. మరో నేత సజ్జల రామ కృష్ణారెడ్డి కి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం కర్నూలు బాధ్యతలను ఇచ్చారు. వీరు ముగ్గురు జగన్ కోటరీ లో అత్యంత కీలకమైన నేతలు. పైగా ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో…ఏపీ రాష్ట్రంలో జగన్… రెడ్డి హవా కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తున్నారన్న బ్యాడ్ నేమ్ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీలోనూ ప్రజల్లోనూ వ్యక్తమవుతోంది.
పరిపాలన పరంగా పథకాల పరంగా అందరికీ సమ న్యాయం చేస్తున్న జగన్ పార్టీ పదవులను ఎక్కువగా రెడ్లకు కట్టబెట్టడం పట్ల సొంత పార్టీలో కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ విధంగా జగన్ భవిష్యత్తులో కూడా వ్యవహరిస్తే వైసిపి పార్టీ రెడ్ల పార్టీ అనే ముద్ర పడుతుంది అని పరిశోధకులు కూడా అంటున్నారు. మరోపక్క పార్టీలో ఉన్న నాయకులు అలాంటిదేమీ వైయస్ జగన్ కి ఉండదని…, జగన్ కి కష్టకాలంలో అండగా నిలబడింది ఆ ముగ్గురు నేతలే అనే ఉద్దేశంతోనే వారికి పార్టీ బాధ్యతలు అప్పజెప్పినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తరుణంలో వచ్చిన ఈ విమర్శ పోవాలంటే ఆ ముగ్గురి నేతల్లో ఏదో ఒక నేతను పక్కనబెట్టి వేరే సామాజికవర్గానికి చెందిన వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే బెటర్ అనే టాక్ వినబడుతోంది.