సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంలో విశ్రాంత ఐఏఎస్ ల పాత్ర ప్రముఖంగా చెప్పుకోవాలి. ఐవైఆర్ కృషారావు, అజయ్ కల్లం రెడ్డి లాంటి సీనియర్ ఐఏఎస్ లు చంద్రబాబు పరిపాలన దగ్గరగా చూసి చంద్రబాబు పరిపాలనలో పనిచేసి లోపాలన్నీ తెలుసు కొని, ఎన్నికలకు ఆరు నెలల ముందు బాబుకు వ్యతిరేకంగా ప్రజల ముందుకు వచ్చారు. బాబు చేసిన పొరపాట్లను సాక్ష్యాలతో సహా జనాలకు అర్థం అయ్యేలా మీడియాకు వెల్లడించారు. ఐవైఆర్ కృష్ణారావు కంటే అజయ్ కలం రెడ్డి చేసిన కొన్ని ఆరోపణలు, ఆయన వెల్లడించిన కొన్ని అంశాలు ఒ వర్గం ప్రజలపై బాగా ప్రభావాన్ని చూపాయి. ఎంతో కొంత వైఎస్ జగన్మోహన రెడ్డికి, వైకాపాకు అవి ఉపయోగపడ్డాయి. ఆ ఫలితమే జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే అజయ్ కలం రెడ్డికి తన పేషీ లోనే ప్రత్యేక కార్యదర్శిగా ఒ హోదా కల్పించి గౌరవాన్ని ఇచ్చారు.
ప్రస్తుతం ప్రభుత్వంలో లో అజయ్ కలాం రెడ్డి పాత్ర బాగా పెరిగింది. సీనియర్ ఐఏఎస్ ల్లో ఐవైఆర్ కృష్ణారావు జగన్ కు దూరమై బిజెపి పంచన చేరగా, జగన్ ను బాగా నమ్మిన, జగన్ కూడా కూడా బాగా నమ్మిన ఎల్వీ సుబ్రమణ్యం ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే జగన్ తో పేచీ పెట్టుకొని దూరమయ్యారు. ప్రస్తుతం జగన్ దగ్గర ఉన్న ఐఏఎస్ లలో ధనుంజయరెడ్డి, ప్రవీణ్ ప్రకాష్.. వీళ్ళందరూ కీలకంగా పని చేస్తుండగా, మాజీ హోదాలో ఒక సీనియర్ గా ఐఏఎస్ లందరికీ పెద్దదిక్కుగా అజయ్ కలాం రెడ్డి చక్రం తిప్పుతున్నారు. ప్రభుత్వం వచ్చిన కొత్తలో అయనపై కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ, కొన్ని వివాదాలలో తలదూర్చి నప్పటికీ క్రమేణా అయన తేరుకున్నారు. జగన్ ఇచ్చిన ప్రాధాన్యత, పార్టీలోనూ.. అటు ప్రభుత్వంలోనూ ప్రత్యేక స్థానం కల్పించడంతో అజయ్ కలాం రెడ్డి కూడా చురుకైయ్యారు. కీలక అంశాలపై నాయకులకు, ఐఏఎస్ లకు సలహాలు ఇస్తూ, కొంత మేరకు సబ్జెక్టు ఉన్న కంటెంట్ అందిస్తూ.. నాయకులు ఎలా మాట్లాడాలో చెబుతున్నారట. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ విద్యుత్ బిల్లుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీనికి అజయ్ కలాం రెడ్డి నుండి స్పష్టమైన సమాధానమే వచ్చింది. ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేనంతగా ఒక ఐఏఎస్ మాట్లాడితే ఎంత దీటుగా సమాధానం చెప్పగలరో అజయ్ కల్లాం రెడ్డి చూపించారు. ఈ ఫలితంగా నిర్మల సీతారామన్ చేసిన ఆరోపణలన్నీ సమసిపోయి అజయ్ కలాం రెడ్డి ఇచ్చిన సమాధానమే హైలెట్ అయ్యింది. ఇదే అదునుగా కొన్ని రాజకీయ పరిపాలన నిర్ణయాల్లో కూడా అజయ్ కల్లాం రెడ్డికి జగన్మోహన రెడ్డి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. గడచిన రెండు మూడు రోజులుగా కూడాఅజయ్ కలాం రెడ్డి ఇటు వైసీపీ ముఖ్య నాయకులు రామకృష్ణారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డిలతో పలు అంశాలపై చర్చలు జరుపుతున్నారట. పరిపాలన సంబందిత అంశాలపైనే కాకుండా, ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న ఆరోపణలు, ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు ముఖ్యంగా పట్టాభి రామ్ వంటి వారు చేస్తున్న ఆరోపణలకు సమాధానంగా అజయ్ కలాం రెడ్డే సబ్జెక్ట్ తయారు చేసి పార్టీ నేతలకు అందిస్తున్నారుట. ఇలా ఒక ఐఏఎస్..రాజకీయ నాయకులకు సలహాలు.. సూచనలు అందిస్తే ఫలితం ఎలా ఉంటుందో అజయ్ కలాం రెడ్డి నిరూపిస్తున్నారు.