బాహుబలి సినిమా ప్రభాస్ కెరీర్ నే మలుపు తిప్పింది. ఏ ఒక్కరు ఊహించని క్రేజ్ ని తీసుకు వచ్చింది. బాహుబలి కన్క్లూజన్ బాలీవుడ్ సినిమాల వసూళ్లను తుంగలో తొక్కి సరికొత్త రికార్డ్ క్రియోట్ చేసింది. ఇప్పటికి సౌత్ అంద్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో బాహుబలి 2 రికార్డులు మరే బద్దలు కొట్టలేకపోయాయి. ఇక బాహుబలి తర్వాత సాహో సినిమాతో మళ్లీ బాలీవుడ్ భారీ స్థాయిలో వసూళ్ళు వచ్చాయి. ఒక యావరేజ్ మూవీ ఆ స్థాయిలో వసూళ్లను రాబట్టడం చూసి బాలీవుడ్ మేకర్స్ అంతా ఆశ్చర్యపోయారు. బాహుబలి 2,సాహో.. సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న మూడు సినిమాలు ఆయన రేంజ్ ని మరింతగా పెంచుతాయని ప్రతీ ఒక్కరు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం సెట్స్ మీదకి వెళ్ళబోతున్న రాధేశ్యామ్ తో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా దాదాపుగా రూ. 250 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ సైన్స్ ఫిక్షన్ చేయబోతున్నాడు ప్రభాస్. వైజయంతీ మూవీస్ 50 వ చిత్రంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. నాగ్ అశ్విన్ ఈ సినిమా షూటింగ్ ని డిసెంబర్ నుంచి మొదలు పెట్టేందుకు సిద్దమవుతున్నాడు. ఇక రీసెంట్ గా బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఓం రౌత్ తో ప్రభాస్ చేయబోతున్న మరో భారీ సినిమాని ప్రకటించారు.
భారీ బడ్జెట్ తో ప్రభాస్ ఓం రౌత్ కాంబో మూవీ ఆదిపురుష్ ను టీసీరిస్ నిర్మించబోతుంది. నాగ్ అశ్విన్, ఓం రౌత్ ల సినిమాలు దాదాపుగా 650 కోట్ల నుండి 750 కోట్ల వరకు ఉంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ రకంగా చూస్తే ప్రభాస్ మూడు సినిమాలు కలిపి వెయ్యి కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్నాయి. ఇప్పటి వరకు ఏ ఇండియన్ స్టార్ సూపర్ స్టార్ ఈ స్థాయి బడ్జెట్ లతో సినిమాలు నిర్మించలేదు. ఒకేసారి వెయ్యి కోట్ల తో 3 సినిమాలు చేస్తున్న క్రెడిట్ ప్రభాస్ సాధించాడు. ఇప్పట్లో ఈ రికార్డ్ బ్రేక్ చేయడం మరే హీరో వల్ల కాదని అంటున్నారు. ఇప్పుడు ఏ కొత్త రికార్డ్ క్రియోట్ చేయాలన్న ప్రభాస్ తర్వాతే ఎవరైనా అంటూ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!