అమరావతి, ఏప్రిల్ 9: సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం ఆరు గంటలతో తెరపడనుంది.
చివరి రోజు ప్రధాన రాజకీయ పార్టీల నేతల పర్యటన వివరాలు…..
టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తాడికొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. తాడికొండ రోడ్షోలో పాల్గొననున్నారు. ఉదయం11:45గంటలకు గురజాల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం1.30గంటలకు సత్తెనపల్లిలో ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు తాడికొండకు చేరుకుంటారు. బస్టాండ్ సెంటర్లో రోడ్డు షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు
వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం పాల్గొననున్నారు. ఉదయం 9.30 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరిలో పర్యటించనున్నారు. 11.30 గంటలకు కర్నూల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారు.
జగన్ సోదరి షర్మిల నేడు విజయవాడ వెస్ట్, మైలవరం, జగ్గయ్యపేటలో ప్రచారంలో పాల్గొననున్నారు. వైఎస్ విజయమ్మ డోన్, ఆళ్లగడ్డలో ప్రచారం చేయనున్నారు. ఆళ్లగడ్డలో ప్రచారాన్ని ముగించి విజయమ్మ పులివెందుల వెళ్లనున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు పాలకొల్లులోని గాంధీ బొమ్మ సెంటర్లో నిర్వహించనున్న ప్రచార సభలో ప్రసంగిస్తారు.
11 గంటలకు నరసాపురం బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యామ్నం ఒంటి గంటకు భీమవరం పోలీసు బొమ్మ సెంటర్ సెంటర్ వద్ద ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు.