(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి)
12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కర స్నానం ఎంతో పవిత్రమని హిందువుల భావన. నదిలో పుష్కరుడు కలిసే సమయంలో స్నానం చేస్తే పుణ్యం దక్కుతుందని పెద్దలు భావిస్తారు. దాన్ని సంప్రదాయంగా ప్రతి 12 ఏళ్లకు జీవనది లో ఆచరించడం ఆనవాయితీ. ప్రస్తుతం ఆంధ్రాలో తుంగభద్రా నదికి పుష్కరాలు జరుగుతున్నాయి. కర్నూలు వేదికగా జరుగుతున్న ఈ క్రతువులో ఇప్పుడు వింత వైఖరి చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం స్నానం చేయడానికి సైతం డబ్బులు వసూలు చేయడం ఇటు భక్తులను నిర్ఘాంత పరుస్తోంది. కోవేట్ సమయంలో అసలు పుష్కరాలు సరి కాదని నిపుణులు హెచ్చరించినా, మనోభావాలు దెబ్బతింటాయని కోణంలో ప్రభుత్వం పుష్కరాలు నిర్వహించడానికి సన్నద్ధమైంది. అయితే నీటిలోకి దిగి వారు తప్పనిసరిగా 30 రూపాయలు కట్టి పుణ్య స్నానం ఆచరించాలి అని బోర్డులు పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూజలు ఇతర క్రతువులకు ధరలు పెట్టి, ఒక పద్దతిగా నిర్వహించవచ్చు గాని, ఏకంగా పుణ్య స్నానానికి ధరను పెట్టడం ప్రభుత్వం కు చెడ్డ పేరు తెస్తుంది.
జనం తక్కువే
తుంగభద్ర నది ని ఉప నది కిందనే జలవనరుల నిపుణులు పరిగణలోకి తీసుకుంటారు. ఏడాది మొత్తం నీరు ఉండే వాటికి జీవనదిని గా పేరు. తుంగభద్ర నది కృష్ణా నదికి ఉపనది గానే ఇప్పటికి భావిస్తారు. అయితే తుంగభద్రా నది పుట్టుక వేరే దగ్గర మొదలయ్యే అవకాశం ఉండడంతో దానికి పుష్కరాలు నిర్వహించడం ఆనవాయితీ. కర్నూలు వేదికగా నీ ఇవి ప్రతిసారి జరుగుతాయి. అయితే ఆ చుట్టుపక్కల వారు కర్నూలు జనం ఎక్కువగా వెళతారు. ఈసారి కోవిడ్ సమయంలో పుష్కరాలు రావడంతో జనం కూడా తప్పువగా రావొచ్చని అంచనా. వచ్చే జనం తగ్గట్టుగానే ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్నానానికి కనీస ధర నిర్ణయించి రేవులోకి దిగాలని చెప్పడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. పెద్దలకు కర్మ క్రియలు, పూజలు, ఇతర క్రతువు లకు ధరలు నిర్ణయించాలి తప్ప ఇలా స్నానానికి సైతం 30 రూపాయలు ధరలు నిర్ణయించడం పట్ల భక్తులు మండిపడుతున్నారు. దీనిని పుష్కరాల్లో భక్తులు సైతం పట్టించుకోవడం లేదు. రేవు వద్దకు వచ్చి సంకల్ప స్నానం చేస్తే 30 రూపాయలు కట్టాలని చెప్పడంతో సంకల్పం లేకుండానే భక్తులు పుణ్య స్నానం చేసి 30 కట్టమని మొండికేస్తున్నారట.