Kiara advani : కియారా అద్వానీ మళ్ళీ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈసారి రెండు సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను కనువిందు చేయబోతోంది. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈమె డెబ్యూ సినిమాతో సాలీడ్ హిట్ అందుకొని క్రేజీ హీరోయిన్ గా మారింది. దాంతో వెంటనే మెగా పవర్ స్టార్ రాం చరణ్ సరసన ఛాన్స్ అందుకుంది. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత కియారా బాలీవుడ్ లోనే సెటిలయింది. మళ్ళీ టాలీవుడ్ లో నటించే అవకాశం వచ్చినా ఇక్కడికి రాలేకపోయింది. చాలాసార్లు టాలీవుడ్ మేకర్స్ ట్రై చేసి ఫెయిల్ అయ్యారు.
ఎట్టకేలకి ఇప్పటికి మళ్ళీ కియారా అద్వానీ టాలీవుడ్ ఎంట్రీ సాధ్యమవుతోంది. అది కూడా రెండు పాన్ ఇండియన్ సినిమాలతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్.టి.ఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ఆయన కెరీర్ లో 30 వ సినిమా. మైల్ స్టోన్ మూవీ కాబట్టి భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. అందుకే పాన్ ఇండియన్ సినిమా కాబట్టి కియారా అద్వానీ అయితే బావుంటుందని ప్రాజెక్ట్ కి బాగా హెల్ప్ అవుతుందని కియారాని ఫైనల్ చేశారట. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారక ప్రకటన మేకర్స్ నుంచి రానుందని ఆ ప్రకటనలో కియారా అద్వానీని అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం.
Kiara advani : టాలీవుడ్ లో రెండు పాన్ ఇండియన్ సినిమాలతో రీ ఎంట్రీ ఇస్తోంది కియారా అద్వానీ.
ఇక స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆయన సొంత నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో భారీ బడ్జెట్ తో శంకర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలయికలో పాన్ ఇండియన్ సినిమాను ప్రకటించారు. నాలుగు ప్రధాన భాషల్లో ఈ సినిమాను రూపొందించనున్నారు. పాన్ ఇండియన్ రేంజ్ సినిమా మరీ ముఖ్యంగా హిందీ మార్కెట్ మీద ఫోకస్ కాబట్టి ఇందులో కూడా కియారాని ఫైనల్ గా ప్రాజెక్ట్ లోకి తీసుకోవాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఈమె ఓకే కూడా చెప్పిందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రకటన కూడా రానుందట. మొత్తానికి టాలీవుడ్ లో రెండు పాన్ ఇండియన్ సినిమాలతో రీ ఎంట్రీ ఇస్తోంది కియారా అద్వానీ.