అవును.. ఇప్పటికైనా సినీ ఇండస్ట్రీ కదులుతుందా? .. రాజకీయంగా తాము ఎంచుకున్న మార్గంలో నడు స్తుందా? ఇదీ.. ఇప్పుడు ప్రశ్న. ఇండస్ట్రీ వర్గాల్లో మెజారిటీ భాగం.. జనసేనవైపు. టీడీపీవైపు ఉండడం గమనార్హం. దీనికి బీజేపీ కూడా కలిసింది. దీంతో కూటమివైపు మొగ్గు చూపుతున్నవారి సంఖ్య మరింత పెరిగింది. ఉదాహరణకు నిన్న మొన్నటి వరకు తటస్థంగా ఉన్న మంచు కుటుంబం ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. తమ మద్దతు ఎన్డీయేకేనని తేల్చి చెప్పింది. అంతేకాదు.. పరోక్షంగా వైసీపీని ఓడించా లనే పిలుపు కూడా ఇచ్చింది.
ఇక, ఇదే అభిప్రాయంతో అనేక మంది సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఉన్నారు. వీరిలో కొందరు ఇప్పటికే టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. కానీ, కొందరు మాత్రం నర్మగర్భంగా ఉన్నారు. ఇంకా వీరు తటపటాయిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏమో.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ వస్తే.. ఇప్పుడు తాము ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే.. ఇబ్బందులు తప్పవేమోననే జంకుతో ఉన్నారు. దీంతో చాలా మంది కేవలం సోషల్ మీడియాకే పరిమితమయ్యారు.
అయితే. కొందరు మాత్రం ఓపెన్ అవుతున్నారు. ఇక, మెగా కుటుంబం మొత్తం జనసేన వైపే ఉంది. అ యితే.. ఇప్పటికీ ఈ ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి, రాం చరణ్ లు మాత్రం మౌనంగానే ఉన్నారు. వీరు కదిలితే.. జనసేన కు మంచి ఊపు వస్తుందనే చర్చ సాగుతోంది. ప్రధానంగా చిరంజీవిని జగన్ అవమా నించారనే వాదన ఈ కుటుంబంలో ఉంది. దీంతో సమయం కోసం వేచి చూస్తున్నారని తెలుస్తోంది.
అదే సమయంలో టీడీపీని అనుకూలంగా చూస్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రధానం దర్శకులు, నిర్మాతలు కూడా టీడీపీకి సానుకూలంగా ఉన్నారు. అయితే.. ఎవరూ కూడా ఇప్పటికిప్పుడు బహిర్గతం కాలేదు. కావడం లేదు. మరికొన్ని రోజులు వేచి చూసి.. పొలిటికల్గా ఏపీలో వాతావరణం ఒక రేంజ్కు చేరుకున్నాక.. తమ సత్తా చూపించే ధోరణిలో ఇండస్ట్రీ ఉందనే చర్చ సాగుతోంది. ఎలా చూసుకున్నా.. జగన్కు అనుకూలంగా తక్కువమందే కనిపిస్తున్నారు.
ఇక, ఇండస్ట్రీలో మరోమాటకూడా వినిపిస్తోంది. సినీ రంగం నుంచి రోజా, బాలయ్య వంటివారు ఉన్నా… సినీ సమస్యలపై వారు స్పందించింది లేదు. దీంతో పవన్ను గెలిపించుకుంటే ఆ గ్యాప్ తగ్గుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఎన్నికల పోలింగ్ సమయానికి నేరుగా చిరంజీవి.. రంగంలోకి దిగి.. పవన్ పోటీ చేసే చోట ప్రచారం చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.