కరోనా నేపథ్యంలో మార్చి నుంచి ఐటీ ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు అప్పుడు 95 శాతానికి పైగా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేశారు ఈ నేపథ్యంలో లో ప్రస్తుతం 75 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుండి వర్క్ చేస్తున్నారు.ఉద్యోగులు ఆఫీస్ కి వచ్చి పనిచేసే పాత పద్ధతికి ఐటీ పరిశ్రమ తిరిగి రాకపోవచ్చునని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ సాహే అన్నారు.
దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుండి పని చేసే వెసులుబాటు కల్పించాయి. గూగుల్, ఫేస్ బుక్ వంటి సంస్థలు వచ్చే ఏడాది వరకు వర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. టాటా స్టీల్ కూడా ఉద్యోగులకు తాజాగా వర్క్ వర్క్ ఫ్రం ఎనీ వేర్ ఇచ్చింది. ప్రస్తుతం ఏ ప్రాజెక్టు లో లేని ఉద్యోగుల తో సహా సపోర్టింగ్, నాన్ -బిల్ ఉద్యోగులందరూ సంబంధిత మేనేజర్లను సంప్రదించి ఇంటి నుండి పని చేయవచ్చని టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ తెలిపింది. కరోనా కేసులు బాగా పెరుగుతుండగా దీంతో తమకు ఉద్యోగుల ఆరోగ్య భద్రత తమకు ప్రాధాన్యం అని పలు ఐటీ కంపెనీలు పేర్కొన్నాయి.
కరోనా కారణంగా పనితీరు పూర్తిగా మారిపోయిందని భవిష్యత్తులో ఉద్యోగులందరూ కూడా కార్యాలయానికి వచ్చి పని చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చునని కొద్ది నెలల క్రితం విప్రో చైర్మన్ రీషద్ ప్రేమ్ జీ అన్నారు. దేశీయ, విదేశీ క్లయింట్లకు సేవలందించేందుకు సుమారు 90 శాతం మంది ఉద్యోగులు ఇంటినుండి లేదా తమకు అనువైన ప్రదేశం నుంచి పనిచేసిన విషయాన్ని గుర్తించారు. లాక్ డౌన్ సమయంలో చోటు చేసుకున్న మార్పులు ఆశ్చర్యానికి గురి చేశాయి. బిపివోలు, ఐటిఎస్ కంపెనీలకు సంబంధించి వర్క్ ఫ్రం హోం, వర్క్ ఫ్రం ఎనీ వేర్ వర్క్ విధానాన్ని సులభతరం చేయడంతోపాటు నిబంధనలను సడలించిన సంగతి తెలిసిందే. డేటా కేంద్రాల సాయంతో అందించే సేవలు ఆఫీస్ బయటినుంచి ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేసేందుకు తోడ్పడతాయని అన్నారు. పాత పని విధానానికి తిరిగి అని నేను అనుకోవడం లేదని సాహే తెలిపారు.కేసులు తగ్గుముఖం పడుతున్న ఆందోళన నేపథ్యంలో ఇంటి నుండి పనిని ఇస్తున్నాయి.