పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మొట్టమొదటి సారి 2019 ఎన్నికల్లో పోటీ చేయడం అందరికీ తెలిసిందే. పార్టీ 2014లో స్థాపించిన గాని ఆ సమయంలో టీడీపీ-బీజేపీ కూటమికి సపోర్ట్ చేసిన పవన్ ఆ తరువాత వాటి పై ప్రజా వ్యతిరేకత రావడంతో బయటకు వచ్చేసి గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ వామపక్షాలతో కలిసి పోటీకి దిగింది.
ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోగా జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన స్థానాలు మొత్తం కలిపితే ఒకటే. అదే తూర్పు గోదావరి జిల్లా రిజర్వుడు నియోజకవర్గం రాజోలు. ఈ నియోజకవర్గం నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రాపాక వరప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచి జనసేన పార్టీ పరువు నిలబెట్టారు.
అయితే గెలిచిన తర్వాత అధికారంలో వైసిపి ఉండటంతోపాటు చాలావరకు రాపాక వరప్రసాద్ వైసిపి పార్టీని సపోర్ట్ చేస్తూ జగన్ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని పొగుడుతూ ముఖ్యమంత్రిగా జగనే ఉండాలని కోరుకుంటూ వస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే గా ఉంది రాపాక చేసిన కామెంట్లు పవన్ కళ్యాణ్ అభిమానుల లో కోపం తెప్పించిన గాని ఆయన మాత్రం వాటిని పట్టించుకోకుండా ముందుకు దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీలోకి తన కుమారుడిని రాపాక పంపించడం తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో సంచలనం అయింది. ఎమ్మెల్యేగా రాపాక వైసీపీ పార్టీలో చేరే అవకాశం లేదు. ఇటువంటి తరుణంలో తెలివిగా ఇటీవల జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ సమక్షంలో తన కుమారుడు వెంకట్రామ్ కు అధికారికంగా వైసీపీ కండువా కప్పించేశారు. తనయుడు ఆ పార్టీలో జాయిన్ అవటంతో రాజోలు లో రాపాక పట్టు బిగ్గించినట్లు టాక్. ఇదిలా ఉండగా రాజోలు నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి చెందిన మరో రెండు గ్రూపుల కి తాజాగా రాపాక వేసిన ఎత్తుగడ రుచించడం లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో రాజోలు నియోజకవర్గం లో మూడు ముక్కల రాజకీయ క్రీడ వైసీపీ పార్టీలో పెద్ద ఆగ్గి రాజేస్తూన్నట్లు ఏపీ రాజకీయ వర్గాలలో వార్తలు వస్తున్నాయి. కుమారుడిని నియోజకవర్గానికి ఇన్చార్జిని చేసి నియోజకవర్గం పై పూర్తిగా పట్టు సాధించడానికి రాపాక సరికొత్త గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేయటమే కాక జిల్లాకు చెందిన మంత్రుల మద్దతు కూడగట్టినట్లు టాక్ వస్తుంది. మొత్తం మీద కుమారుడిని రంగంలోకి దింపి రాపాక వరప్రసాద్ వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు రాజోలు నియోజకవర్గంలో మిగతా వైసిపి గ్రూపులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్లు సమాచారం.