నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో జగన్ పడుతున్న భయం, వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలు సత్యదూరాలు కాదనే విషయంపై ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది. అందుకు కారణమయ్యింది… పార్క్ హయత్ భేటీ వ్యవహారం. ఆ భేటీ అనంతరం రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. ఇవ్వాలని రూల్ లేకపోయినా.. ఇవ్వాల్సిన బాధ్యత ఆయనపై ఉందనే వాదనలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇంక నిమ్మగడ్డ వ్యవహారం నిమ్మగడ్డకే వదిలేయాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో తమ విమర్శలకు, తమ అనుమానాలకు ఒక క్లారిటీ వచ్చేసిన తరుణంలో.. ఇంక ఆయన వ్యవహారం ఆయనే వదిలేసి, ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ ని నియమించేసుకుని.. వీలైతే ఆయన ఆధ్వర్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వెళ్లాలని జగన్ భావిస్తున్నారంట! నిమ్మగడ్డపై ప్రజలకు క్లారిటీ రానిపక్షంలో.. ఈ దోబూచులాటలు ఇంకొంతకాలం సాగేవేమో కానీ… క్లారిటీ వచ్చేసింది, రహస్య సంబంధాలపై వాస్తవాలు వెలుగులోకి వచ్చేశాయి కాబట్టి ఇంక ఆ విషయాన్ని లైట్ తీసుకొవాలని జగన్ భావిస్తున్నారంట. అందులో భాగంగా… ఇక ఏపీకి ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డనే ఫైనల్ చేయాలని చూస్తున్నారంట.
సాధారణంగా స్థానిక ఎన్నికల విషయంలో అధికార ప్రతిపక్షాలపై నిత్యం ఆరోపణలు వస్తుంటాయి. ఎవరు అవునన్నా కాదన్నా 151స్థాయి మెజారిటీ వచ్చిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైకాపా క్లీన్ స్వీప్ చేస్తాదనే ఊహాగాణాల్లో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అదే జరిగితే.. ప్రతిపక్షాల విమర్శలకు అంతే ఉండదు. కాబట్టి ఈ సమయంలో అధికారులను, పోలీసులను తమకు అనుకూలంగా వాడుకున్నారని, ఎన్నికల సంఘం కూడా చూస్తూ ఉండిపోయిందనే విమర్శలు రాకుండా ఉండాలంటే… టీడీపీ కోరుకుంటున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని వైకాపా పెద్దలు భావిస్తున్నారంట.
ఎన్నికలలో అక్రమాలు జరిగాయని, అధికారపార్టీ నేతలు అరాచకాలు చేశారని టీడీపీ విమర్శలు చేయలేని పరిస్థితి వస్తుందని భావిస్తున్నారంట వైకాపా నేతలు. ఎందుకంటే.. వారు కోరుకున్న వ్యక్తే ఎన్నికల అధికారిగా ఉన్నారు కాబట్టి.. ఆ విమర్శలు చేసే నైతిక హక్కు టీడీపీ కోల్పోయినట్లు అవుతుందనేది వారి ఆలోచన! దీంతో… ఆయనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కుర్చోబెట్టే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుందట అధికార పార్టీ! ఇదే జరిగితే.. ఒకే దెబ్బకు రెండు పిట్టలనేది వారి ఆలోచన కాబోలు!!