NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ముద్రగడతో వైసీపీ నేతల కీలక భేటీ .. పార్టీలోకి ఆహ్వానం

YSRCP: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక దాదాపు ఖాయం అయ్యింది. ఈ నేపథ్యంలో గురువారం ముద్రగడ పద్మనాభం నివాసానికి వైసీపీ నేతలు వెళ్లారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలో,  జిల్లాల్లో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఆయనను పార్టీలోకి అహ్వానించారు. వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం వైసీపీ ఇన్ చార్జి దవులూరి దొరబాబు, జగ్గంపేట ఇన్ చార్జి తోట నరసింహం లు ముద్రగడతో సమావేశం అయ్యారు.

భేటీ ముగిసిన అనంతరం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు ముద్రగడను కలవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించామని చెప్పారు. త్వరలోనే ముద్రగడ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ గొప్ప ఉద్యమం చేశారని అన్నారు. ఆఫర్ల కోసం పార్టీ చేరే వ్యక్తి కాదనీ, స్వతహాగా ఆయనే పార్టీలో చేరతారన్నారు. సీఎం వైఎస్ జగన్ కు పెద్దలను ఎలా గౌరవించాలో తెలుసుననీ, ముద్రగడకు సముచిత స్థానం ఇస్తారనీ మిథున్ రెడ్డి అన్నారు.

కాగా, ఇప్పటికే ముద్రగడతో మిథున్ రెడ్డి ఇంతకు ముందు ఫోన్ లో మాట్లాడారు. ఆయన పార్టీలో చేరికకు సముఖంగా ఉండటంతో ఇవేళ నేరుగా కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. మరో పక్క కాపుసేన నేత, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.  జగన్ ఓటమే లక్ష్యంగా జత కట్టిన టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కూడా కలవడం దాదాపు ఖాయమైంది. ఎన్డీఏలో టీడీపీ చేరిక పైన ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన బలంపై జగన్ గురి పెట్టారు. ఓ పక్క చేగొండి హరి రామజోగయ్య కుమారుడు, మరో పక్క ముద్రగడను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాపు ఓటు బ్యాంక్ పై వైసీపీ వ్యూహం అమలు చేస్తొంది.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముద్రగడ పద్మనాభం ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. పవన్ వైపు కాపు వర్గం మొగ్గు చూపుతున్న వేళ ముద్రగడతో ఆ ఓటు బ్యాంక్ కు గండి కొట్టవచ్చని వైసీపీ లెక్కలు వేస్తొంది. ఈ క్రమంలో ముద్రగడ కుమారుడికి రాష్ట్ర స్థాయిలో కీలక నామినేటెడ్ పదవి కట్టబెడతారని తెలుస్తొంది. ఎన్నికల్లో ముద్రగడను రాష్ట్రంలో పలు చోట్ల ప్రచారం చేయించాలని వైసీపీ భావిస్తొందని సమాచారం.

BRS MLA: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్ .. కళాశాల భవనాలు కూల్చివేత

Related posts

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju