Corona: దేశంలో కరోనా వైరస్ భారీ స్థాయిలో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కసారిగా కేసులు పెరిగిపోవటంతో చాలా రాష్ట్రాలలో పరిస్థితి దారుణంగా మారింది. ఒకపక్క వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరుగుతున్న గాని మరోపక్క కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో టెన్షన్ పట్టుకుంది. ఇదిలా ఉంటే దేశంలో సామాన్యుల తో పాటు చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. పలువురు పొలిటిషన్ లు మరియు ఉన్నత అధికారులు ఈ కరోనా బారిన పడుతున్నారు.
ఈ మహమ్మారి ఎవరిని కనికరించడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ కరోనా బారిన పడటం జరిగింది. స్వయంగా ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. .”నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోండి కరోనా జాగ్రత్తలు పాటించండి. అందరం కలిసి కరోనా ను జయించుదాం.” అని సంతోష్ గంగ్వార్ పేర్కొన్నారు.
దేశంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రపంచంలో కరోనా వైరస్ ఎంట్రీ వచ్చిన టైం లో అన్ని దేశాల కంటే ఇండియా సమర్థవంతంగా ఎదుర్కొంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది. ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్న అమెరికా దేశానికి పోటీగా ఇండియా పరిస్థితి మారింది. చాలా వరకు ఇండియాలో డేంజర్ బెల్స్ స్టార్ట్ అయ్యాయి అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Central minister had corona positive