సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీ కండువా కప్పుకోని మోహన్ బాబు వైస్ జగన్ కి మద్దతు తెలుపుతూ ప్రచారం చేయడం జరిగింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆ సమయములో టిడిపి అధినేత చంద్రబాబు ని తీవ్ర స్థాయిలో ఎండగట్టడం జరిగింది. నమ్మకద్రోహి, వెన్నుపోటు దారుడు అంటూ చంద్రబాబు ని 2019 ఎన్నికల టైంలో తీవ్రస్థాయిలో మోహన్ బాబు విమర్శించడం జరిగింది.
చంద్రబాబు అంత నీచుడు ప్రపంచంలో మరెవరూ ఉండరని…. తనతో బిజినెస్ స్టార్ట్ చేసి చాలా కుయుక్తి గా అప్పట్లో చంద్రబాబు…. తనని మోసం చేసినట్లు మోహన్ బాబు తెలిపారు. చంద్రబాబు పాల కంపెనీ హెరిటేజ్ సంస్థ అని మోహన్ బాబుతో కలిసి ప్రారంభించి తర్వాత సైలెంట్ గా చంద్రబాబు ఆయన్ని పక్కన పెట్టడం జరిగిందట. ఇదే విషయాన్ని 2019 ఎన్నికల సమయంలో మోహన్ బాబు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన విద్యా సంస్థలకు ప్రభుత్వం నుండి రావలసిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా చంద్రబాబు చెల్లించకుండా అనేక ఇబ్బందులకు గురి చేసినట్లు మోహన్ బాబు తెలిపారు.
ఇదిలా ఉండగా ఇటీవల తనని వ్యాపారంలో మోసం చేశాడు ఒక ప్రముఖ వ్యక్తి, ఆ వ్యక్తి ముఖ్యమంత్రి గా కూడా వ్యవహరించారు. తాను ఆ వ్యక్తి చేసిన బిజినెస్ మోసం ఎప్పటికీ మర్చిపోలేని అని…. ఇటీవల మరోసారి మోహన్ బాబు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన అద్భుతంగా ఉందని అన్నారు.
ఇదే రీతిలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ అంటే తనకు ఎంతో ఇష్టమని, అలాగే ప్రధాని మోడీ తనని “బడే భాయ్” అంటూ సంబోధిస్తారు అని….అయినా గాని తాను ఎంతలో ఉండాలో అంతలో ఉంటానని, స్నేహితుడు కదా అని, మోడీకి తన కి మధ్య ఉన్న స్నేహాన్ని దుర్వినియోగం చేసుకోను అని స్పష్టం చేశారు. పరిస్థితి ఇలా ఉండగా కరోనా ప్రభావం వలన సినిమా థియేటర్ లో ఇప్పుడు ఓపెన్ అవటం కష్టం అని, అదేవిధంగా సినిమా షూటింగులు కూడా జరపటం అనుకున్నంత ఈజీ కాదని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.