పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలలో పేరొందిన రాజకీయ కుటుంబం మాగంటి కుటుంబం. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి కాంగ్రెస్ పార్టీలో కొన్ని దశాబ్దాల పాటు ఈ జిల్లాలో ప్రాతినిధ్యం వహించి…. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక పదవులు అధిరోహించారు. ఆ తరువాత ఆయన కుమారుడు మాగంటి బాబు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయి వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగారు. వైయస్ చనిపోయిన అనంతరం మాగంటి బాబు టిడిపి పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. 2014 ఎన్నికల సమయంలో మాగంటి బాబు ఎంపీగా టిడిపి నుండి పోటీ చేసి గెలవడం జరిగింది.
ఏలూరు లోక్ సభ స్థానం నుండి గెలుపొందిన మాగంటి బాబు టిడిపి పార్టీలో చంద్రబాబు హయాంలో కాంగ్రెస్ పార్టీలో మాదిరిగా రాణించలేకపోయారు. చంద్రబాబు సామాజిక వర్గం అయినాగానీ మాగంటి బాబు తన పట్టు జిల్లా రాజకీయాల్లో నిలుపుకోలేకపోయారు అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన గాని అప్పటి స్థానిక ఎమ్మెల్యే బడేటి బుజ్జి తో విభేదాల కారణంగా మాగంటి బాబు ప్రభావం పెద్దగా నియోజకవర్గంలో జిల్లాలో కనబడేది కాదు అని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఈ విషయంపై అనేక సార్లు చంద్రబాబు తో మాట్లాడిన గాని ఏనాడు పంచాయతీకి చంద్రబాబు సహకరించలేదని…. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలో తన తర్వాత వారసుడిగా మాగంటి రాంజీ ని రాజకీయాల్లో సరైన ప్లాట్ ఫామ్ తండ్రి మాగంటి బాబు వేయలేకపోయారు అని జిల్లా నేతల్లో టాక్. స్థానికంగా ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి చనిపోయిన గాని… చంద్రబాబు కూడా ఈ నియోజకవర్గంలో మాగంటి కుటుంబాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదట. దీంతో జగన్ కి పని పెట్టకుండానే రాజకీయంగా చంద్రబాబే మాగంటి ఫ్యామిలీ పొలిటికల్ చాప్టర్ క్లోజ్ అయ్యే రీతిలో వ్యవహరిస్తున్నట్లు జిల్లా రాజకీయాల్లో గట్టిగా టాక్ నడుస్తోంది. తెలుగు యువత అధ్యక్ష పదవి విషయంలో మాగంటి కొడుకు రాంజీ పేరు సూచించిన గాని చంద్రబాబు లైట్ తీసుకున్నట్లు టాక్. దీంతో మాగంటి ఫ్యామిలీ టిడిపిలో ఉండాలో బయటకొచ్చేయాలో అనే డైలమాలో ఉన్నట్లు సమాచారం.