హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. శనివారం సాయంత్రం ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతల బృందం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను రాజ్భవన్లో కలిసి ఫిర్యాదు చేసింది.
కాంగ్రెస్ను వీడుతున్నట్టు చెప్పిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని నేతలు గవర్నర్ను కోరారు. ఆ తొమ్మిది మంది ఎమ్మెల్యేల వివరాలను గవర్నర్కు ఇచ్చారు. వారిపై అనర్హత వేటు వేసేలా సభాపతికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏడు పేజీల వినతిపత్రాన్ని అందజేశారు.
గత సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున 19 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో తొమ్మిది మంది అధికార టిఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు.
ఖమ్మం జిల్లా నుండి రేగ కాంతారావు (పినపాక), అత్రం సక్కు (అసిఫాబాద్), హరిప్రియ నాయక్ (ఇల్లందు), కందల ఉపేంద్రర్ రెడ్డి (పాలేరు), వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం), రంగారెడ్డి జిల్లా నుండి పి సబితా ఇంద్రారెడ్డి (మల్లేశ్వరం), దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (ఎల్ బి నగర్), నల్లగొండ జిల్లా నుండి చిరుమర్తి లింగయ్య (నకిరేకల్లు), మహబూబ్ నగర్ జిల్లా నుండి కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి టిఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు.