హైదరాబాద్: ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేసేందుకు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ ప్రచురించిన కథనంపై టిఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘నా గురించి ఒక ప్రముఖ మీడియా సంస్థ నుంచి వచ్చిన కథనం ఫేక్ న్యూస్లకు ఒక ఉదాహరణ. తప్పుడు సమాచారాన్ని ప్రచురించడం సరికాదు. ముఖ్యంగా దేశం మొత్తం ఫేక్ న్యూస్కు వ్యతిరేకంగా పోరాడుతున్న తరుణంలో ఇలా వ్యవహరించడం సముచితం కాదు. సరదాగా అయినా ఇలాంటి ఫేక్ న్యూస్ను ప్రచురించవద్దని మీడియా సంస్థలను కోరుతున్నా’ అని హరీష్ రావు ట్వీట్ చేశారు.
ఏ పేజీలో అయితే తనపై తప్పుడు వార్తను ప్రచురించారో అదే పేజీలో రేపు తనకు క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు మరో ట్వీట్లో డిమాండ్ చేశారు.
డిసి కథనం ఇదే..