కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ దెబ్బకి ఏపీ ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో మునిగిపోయింది. ఇటువంటి తరుణంలో ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం సీఎం వైఎస్ జగన్ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళ్తే ఏపీఎస్ఆర్టీసీ సంస్థకు మొత్తంగా 13 జిల్లాలలో పంతొమ్మిది వందల ఎకరాల స్థలాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ స్థలాలను వినియోగించుకుని సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం సరికొత్త ఆలోచన వైసీపీ ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు టాక్. బయటికి వచ్చిన సమాచారం ప్రకారం ఆర్టీసీ స్థలాలను వాణిజ్యపరంగా వినియోగించుకుంటే ఆదాయం మెరుగవుతుందని అనుకుంటున్నారట.
ఈ నేపథ్యంలో ఆర్టీసీ స్థలాలను సమగ్రంగా సర్వే చేయించడంతో పాటు వాటి టైటిల్ డాక్యుమెంట్లు అన్నిటినీ పరిశీలించాలని ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో రీజినల్ మేనేజర్ లకి ఆదేశాలు పంపటం జరిగింది సర్వే మరియు ల్యాండ్ పట్టాలు అంతా పరిశీలన అయ్యాక వాణిజ్యపరంగా వినియోగించడానికి ఏ స్థలాలు అనువుగా ఉన్నాయో గుర్తించడానికి ఆర్టీసీ అధికారులు కూడా రెడీ అవుతున్నారు. మరోపక్క గత ప్రభుత్వంలో ఆర్టీసీ భూములకు సంబంధించి కొన్నిచోట్ల అవకతవకలు జరిగినట్లు ప్రస్తుత ప్రభుత్వం అనుమానిస్తుంది.
దీంతో విభజన తర్వాత ఆర్టీసీ స్థలాలకు సంబంధించి జరిగిన లావాదేవీలను పూర్తిగా పరిశీలించే ఆలోచనలో ప్రభుత్వం మరో పక్క అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా విశాఖపట్టణం మరియు పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలో అక్రమ జరిగాయని భావిస్తోంది. దీంతో ఒకవైపు ఆర్టీసీ భూముల సర్వే చేపడుతున్న మరోవైపు గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ లో జరిగిన అవకతవకలను బయటపెట్టడానికి జగన్ సర్కార్ రెడీ అవుతున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో టాక్ గట్టిగా వినపడుతోంది.