జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ భవితవ్యం ఆగమ్యగోచరంగా ఉన్నట్లు నియోజకవర్గంలో వార్తలు వస్తున్నాయి. అనధికారికంగా అధికారపార్టీ వైసీపీకి మద్దతు తెలుపుతున్న రాపాక వరప్రసాద్ కి కొంతకాలంగా నియోజకవర్గంలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నట్లు టాక్. మొన్నటి వరకు రాజోలు నియోజకవర్గంలో వైసిపి రెండు వర్గాలుగా ఉండేవి. ఇందులో ఒక గ్రూపు రాపాక వరప్రసాద్ కి మద్దతుగా నిలిచేది. వరుసగా రెండు ఎన్నికలలో పోటీచేసిన రాజేశ్వరరావు ఓ వర్గమైతే, రాజోలు వైసీపీ పార్టీ ఇన్చార్జిగా ఉన్న పెద్దపాటి అమ్మాజీ ది మరో గ్రూపు.
సీఎం జగన్ కి జై కొట్టిన నాటినుండి రాపాక వరప్రసాద్ అమ్మాజీ వర్గంతో నియోజకవర్గంలో కలిసి పని చేస్తున్నారు. అయితే కొన్నాళ్ళకు ఏమైందో ఏమో అమ్మాజీ వర్గం… ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తో టచ్ మీ నాట్ అన్నట్టు వ్యవహరిస్తున్నట్లు నియోజకవర్గంలో సరికొత్త టాక్ వస్తోంది. ఈ పరిణామంతో అటు జనసేన ఇటూ వైసీపీ క్యాడర్ మధ్య రాపాక వరప్రసాద్ ఏకాకిగా మారి ఉనికి కోల్పోతున్నట్లు టాక్. ముఖ్యంగా రాపాక వరప్రసాద్ వర్గం ఉన్న కొద్దీ ఆయన వెంట నడవడానికి అసహనం చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే తుని నుంచి వచ్చిన అమ్మాజీ వర్గానికి…రాపాక సన్నిహితంగా ఉండటంతో నియోజకవర్గంలో మద్దతుదారులు రాపాక వరప్రసాద్ కి వ్యతిరేకంగా మారినట్లు టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉండగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ పొందటానికి రాజేశ్వరరావు మళ్లీ పుంజుకోకుండా బయటనుంచి వచ్చిన పెద్దపాటి అమ్మాజీ కి సపోర్ట్ చేస్తే… టికెట్ల కేటాయింపు విషయంలో నియోజకవర్గంలో తన పట్టు ఉంటుందని, ఈ విధంగా రాపాక ఆలోచించినట్లు టాక్. అయితే ఇప్పుడు అమ్మాజీ వర్గం కూడా పక్కన పెట్టడంతో…నియోజకవర్గంలో అటూ ఇటూ కాకుండా రాపాక పొలిటికల్ కెరియర్ ఉన్నట్లు టాక్ వస్తోంది.