ఢిల్లీ, జనవరి 29: సోషలిస్ట్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండేజ్ (88) కన్నుమూసారు. కొద్ది రోజులుగా ఆయన స్వైన్ఫ్లూతో బాధపడుతూ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1930 జూన్ మూడున కర్నాటక రాష్ట్రం మంగళూరులో ఆయన జన్మించారు. కార్మిక సంఘాల (ట్రేడ్ యూనియన్ల) ఏర్పాటులో ఆయన క్రియాశీల భూమిక పోషించారు. అత్యవసర పరిస్థితి కాలంలో జైలులో ఉండే బీహార్లోని ముజఫర్పూర్ నియోజకవర్గం నుండి ఐదు లక్షల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
తొమ్మిది పర్యాయాలు లోక్సభకు ఎన్నికైన ఫెర్నాండేజ్ ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందారు. జనతాదళ్లో క్రీయాశీలకంగా వ్యవహరించిన ఆయన 1994లో సమతా పార్టీని స్థాపించారు.
దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం జనతా పార్టీ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా, వాజ్పేయి ప్రభుత్వంలో రక్షణ, రైల్వే శాఖ మంత్రిగా పని చేశారు.
ఫెర్నాండేజ్ మృతికి రాష్టపతి రామనాధ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోది, ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే, ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్నాధ్ సింగ్, నతిన్ గడ్కరీ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, చంద్రబాబు, కె చంద్రశేఖరరావు తదితర ప్రముఖులు సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.