విశాఖ, జనవరి 25: రాబోయే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై జనసేన అధినేత అధినేత పవన్ కళ్యాణ్తో వామపక్షాల అగ్రనేతలు బేటీ అయ్యారు. విశాఖ రుషికొండ రిసార్ట్స్లో శుక్రవారం వామపక్షాల నేతలతో జనసేనాని చర్చలు జరుపుతున్నారు.
జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇప్పటికే ఈ పార్టీలు నిర్ణయించుకున్నాయి. సీట్ల సర్దుబాటు, ఎన్నికల ప్రణాళికపై చర్చించేందుకు ఈ నేతలు సమావేశమైయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్లు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, వామపక్షాల నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, బివి రాఘవులు, మధు, వై వెంకటేశ్వరరావు, నర్శింహరావులు సమావేశమై చర్చిస్తున్నారు.
గత వారం రాష్ట్ర సిపిఐ, సిపిఎం కార్యదర్శులు రామకృష్ణ, మధులు విజయవాడ పార్టీ కార్యాలయంలో జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్తో తొలి విడత చర్చలు జరిపి వారు ఆశిస్తున్న స్థానాల జాబితాను అందజేశారు. తరువాత పార్టీ అధినేత పవన్ నివాసంలో ఆయనతోనూ సమావేశమయ్యారు.