Mask : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఇటీవల తెలపడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా తెలుగు రాష్ట్రాలలో కూడా పాజిటివ్ కేసులు ఊహించని విధంగా పెరుగుతూ ఉండటం తో.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి అని తెలుపుతూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మాస్కు ధరించి అని వారికి జరిమానాలు విధించటానికి రెడీ అయింది. మాస్కు ధరించకుండా మార్చి 23 నుండి ఎవరైనా బయట కనబడితే పట్టణాల్లో 1000 రూపాయలు గ్రామాలలో అయితే 500 రూపాయలు జరిమానా విధించింది. దీంతో రేపటినుండి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నట్లు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోపక్క రాష్ట్రంలో స్కూల్స్ అదేవిధంగా కాలేజీల విషయలలో కూడా సరి కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న టాక్. భారీ స్థాయిలో కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ..కచ్చితంగా కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయింది.