చైనా పై మోడీ సర్కార్ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. చైనా ఇండియా సరిహద్దు ప్రాంతం వద్ద దూకుడుగా వ్యవహరించి చైనా పట్ల అదే రీతిలో చైనా కి చెక్ పెడుతూ మోడీ సర్కార్ కీలక నిర్ణయాలు గత కొన్ని రోజుల నుండి తీసుకొస్తున్నారు. చైనా కి సంబంధించి యాప్స్ అదే రీతిలో చైనా ప్రొడక్ట్స్ వాటిపై నిషేధాలు కొనసాగిస్తూ నిర్ణయాలు తీసుకున్న మోడీ సర్కార్ మొన్న రాఫెల్ యుద్ధ విమానాలను చైనా భారత్ సరిహద్దు వద్ద ల్యాండ్ చేయటం జరిగింది.
ఇదిలా ఉండగా తాజాగా ఇండియాలో చైనా సంస్థలు వాటి అనుబంధ సంస్థల పై ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. మనీ ల్యాండరింగ్ కేసులో చైనా సంస్థలు వాటి అనుబంధ సంస్థలు బ్యాంకు ఉద్యోగుల మీద ఆదాయపు పన్ను శాఖ ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. షెల్ కంపెనీల ద్వారా కొంత మంది చైనీయులు కొంతమంది ఈ దేశానికి చెందిన వారి సహచరులు మనీలాండరింగ్ మరియు హవాలా లావాదేవీలకు పాల్పడినట్లు అందిన సమాచారం తో చైనీ సంస్థల పై వారి సన్నిహిత సమస్యలు మరియు పలు బ్యాంకు ఉద్యోగుల పై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసినట్లు సమాచారం.
చైనా అనుబంధ సంస్థల ద్వారా ఇండియాలో రిటైర్డ్ షో రూమ్ లో బిజినెస్ ను స్టార్ట్ చేసిందని నకిలీ కంపెనీలు స్థానిక భాగస్వామ్యంతో వెయ్యి కోట్ల అక్రమ రవాణా హవాలా కి 40కిపైగా డమ్మీ కంపెనీలా బ్యాంకు ఖాతాలు సృష్టించి ఏకకాలంలో వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే చైనీయులు పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేస్తున్నట్లు ఆదాయపన్ను శాఖ వివరించింది. ఏ రకంగా చూసుకున్నా చైనా కంపెనీలను స్వదేశంలో ఉండకుండా చేయాలనే రీతిలో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.