దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుండి అన్ని రాష్ట్రాల్లో కంటే మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి ఉన్న కొద్ది పెరుగుతునే ఉంది. అంతేకాకుండా దేశంలోనే కొత్త పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో కరోనా కంట్రోల్ చేయడానికి మహారాష్ట్ర సర్కార్ మరియు కేంద్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ సూసైడ్ కేసు విషయంలో మహారాష్ట్ర సర్కార్ పాత్ర కూడా ఉన్నట్లు, ప్రభుత్వంలో కీలక నాయకుడు కి సంబంధించిన ఓ కొడుకు పాత్ర ఈ సుశాంత్ కేసులో ప్రధానమైన పాత్ర అని అటు బాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి.
ఇటువంటి తరుణంలో ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారిస్తున్నా బీహార్ పోలీసులను ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనలు అంటూ వారిని 14 రోజులపాటు క్వరంటెన్ కి తరలించడం పెద్ద వివాదాస్పదంగా మారింది. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం పై బీహార్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండిపడింది. అసలు ఆ టైంలో క్వారైంటైన్ అనే రూల్ ముంబై నగరంలో లేదని విమర్శలు రావటం స్టార్ట్ అయ్యాయి.
ఇదిలా ఉండగా ఇటీవల ముంబై నగరంలో ఎవరైనా అడుగుపెడితే ఖచ్చితంగా 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని తాజాగా బీఎంసి నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీంతో పరిస్థితులు బట్టి చూస్తుంటే, చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే బీఎంసి ఈ నిర్ణయని తీసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మరోపక్క ఈ కేసులో సిబిఐ మరియు ఈడి చాలా దూకుడుగా విచారణ వేగవంతం చేస్తున్నాయి.