హైదరాబాద్: వైసిపి అధినేత వైఎస్ జగన్ నివాసం వద్ద చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎంఎల్ఏ డాక్టర్ సునీల్కు చేదు అనుభవం ఎదురైంది. జగన్ నివాసంలోకి వెళ్లేందుకు సునీల్ ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
సిట్టింగ్ ఎంఎల్ఏగా ఉన్న సునీల్కు ఈసారి టికెట్ దక్కకపోవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని జగన్ నివాసం వద్దకు కుటుంబసభ్యులతో కలసి ఆయన వచ్చారు. దాదాపు రెండు గంటల సేపు జగన్ నివాసం వద్ద వేచి చూసినా ఆయనను లోపలకు అనుమతించలేదు.
అదే సమయంలో సీనియర్ నేత,మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడకు వచ్చారు. సునీల్ ను పట్టించుకోకుండా ఆయన లోపలకు వెళ్లిపోయారు. రామచంద్రారెడ్డి కూడా చూసీచూడనట్లు వ్యవహరించడంతో సునీల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.