భారతదేశం పై ఎంతో పగబట్టిన చైనా వారు కొత్త కొత్త కుట్రలతో బయటకు వస్తున్నారు. ముందుగా సరిహద్దుల వద్ద ఉన్న ఉద్రిక్తతలు తగ్గించే నేపథ్యంలో భారత్ చేస్తున్న ప్రయత్నాలను నిర్వీర్యం చేస్తూ వాళ్ళు అసలు కమాండర్ స్థాయి చర్చల్లో కూడా సహకరించకపోవడం గమనార్హం. అలాగని కయ్యానికి కాలుదువ్వేంత ధైర్యం కూడా చైనా కు లేదు. ప్రతిసారి దొంగ దెబ్బ తీసేందుకే మొగ్గుచూపుతున్న చైనా-నేపాల్ మ్యాప్ లో ఇండియా భూభాగాన్ని చొప్పించి భారతీయుల సెంటిమెంట్ ను హర్ట్ చేసింది. ఇది చూసి భారత సైనిక దళాలు మళ్లీ గల్వాన్ లో జరిగినటువంటి కవ్వింపు చర్యలకు చైనావారు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఇప్పుడు ఇదే సమయంలో జమ్మూకాశ్మీర్ ప్రాంతాలను పాకిస్తాన్ మ్యాప్ లో కనబడడం చూస్తుంటే చైనా-పాకిస్తాన్ ప్రత్యక్షంగా పరోక్షంగా చేతులు కలిపిన అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే చాలాసార్లు వారిద్దరూ సన్నిహితంగా ఉంటూ భారత్ ను దొంగదెబ్బ తీసే చర్యలు చేస్తున్నారని…. ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఇలాంటి సమయంలో పాకిస్థాన్ తమ మ్యాప్ లో భారత్ లో ఒక భాగాలైన జమ్ము మరియు కాశ్మీర్ ప్రాంతాలను అంతర్గతం చేయడం వెనుక చైనా హస్తం ఉందని భారత్ భావిస్తోంది.
అలాగే పాక్ కూడా భారత ఆర్థిక పరిస్థితి క్షీణించింది దశలో…. సంక్షోభ పరిస్థితిని చక్కబెట్టే పనిలో ఉన్నప్పుడు దొంగదెబ్బ తీసేందుకు చేస్తున్న సన్నాహాల్లో భాగంగా ఈ మ్యాప్ సిద్ధం చేసిందని…. ఇక ఇటువంటి కవ్వింపు చర్యలు భవిష్యత్తులో భారత్ మరియు చైనా నుండి ఎన్నో ఆశించవచ్చు కేంద్రం భావిస్తోంది. అయితే దొంగదెబ్బ ను కాచుకొని ముందు జాగ్రత్తగా ఉండడం తప్పించి ప్రస్తుతానికైతే భారత్ మొదటి దెబ్బ కొట్టే అవకాశం అయితే లేదు. ముందునుండి భారత్ శాంతి మంత్రాన్ని జపిస్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే పెద్దగా ఉద్రిక్త పరిస్థితులు భారత్ వల్ల రాకవచ్చు కానీ వారు ఊరుకుంటారా అన్నది ఇక్కడి ప్రశ్న.