ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కొద్దిమందికి వరం గా మారితే మరి కొద్ది మందికి తలనొప్పిగా మారింది. చాలామంది సీనియర్ రాజకీయ నేతలు జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై అసహనం చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న సీనియర్ రాజకీయ నేతలు కొత్త జిల్లాల ఏర్పాటు విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. పరిస్థితి ఇలా ఉండగా మరో పక్క పార్టీలో ఉన్న జూనియర్లకు మాత్రం కొత్త జిల్లాల ఏర్పాటు సరికొత్త అవకాశాలు తీసుకువస్తున్నట్లు పార్టీలో టాక్. ఈ విధంగానే ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి కి లక్కీ ఛాన్స్ కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో తగిలే అవకాశం ఉందని పార్టీలో తెగ డిస్కషన్స్ జరుగుతున్నాయి.
ముఖ్యంగా గిరిజన ఎమ్మెల్యే కావటంతో ‘అరకు’ కొత్త జిల్లాగా ఏర్పడే అవకాశం ఉండటంతో పాటు ఈ జిల్లా అన్ని పూర్తిగా గిరిజన జిల్లాగా మార్చాలనే ప్రతిపాదన ప్రభుత్వం ముందు ఉండటంతోపాటు అరకు జిల్లా పరిధిలోకి కురుపం, పార్వతీపురం, సాలూరు వస్తుండటం పుష్ప శ్రీవాణి కి కలిసొచ్చే అంశమని పార్టీ నేతలు తెలుపుతున్నారు. ఎస్టీ నియోజకవర్గమైన కురుపం నుంచి వరుస విజయాలు సాధిస్తున్న పుష్పశ్రీవాణి…. అరకు కొత్త జిల్లాగా ఏర్పడితే ఇక రాజకీయంగా ఆమె ఎదురు లేదన్న టాక్ గట్టిగా వినబడుతోంది.
మరోపక్క పుష్ప శ్రీవాణి ఎదుగుదలను వైసీపీ పార్టీలో ఉండే కీలక నాయకులు అడ్డుకోవాలని అనేక ప్రయత్నాలు మొన్నటి వరకు చేయటం జరిగింది. ఇటువంటి తరుణంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ‘అరకు’ పూర్తిగా గిరిజన జిల్లాగా ఏర్పడితే ఇంకా పుష్పశ్రీవాణి పొలిటికల్ కెరియర్ కి బ్రేకులు వేసే వారు ఉండరు అని ఆమె సన్నిహితులు అంటున్నారు. అంతేకాకుండా విశాఖపట్టణంలో రాజధాని వచ్చే అవకాశం ఉండటంతో పుష్ప శ్రీవాణి రాజకీయ పరపతి పెరగటమే కాక ప్రభుత్వంలో కీలక భూమిక పోషించే అవకాశం ఉంటుందని ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. వైసీపీ పార్టీలో మొదటి నుండి జగన్ కి అత్యంత నమ్మకస్తురాలిగా పేరొందిన శ్రీవాణి…చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైములో అనేక ఇబ్బందులు ఆఫర్లు ఇచ్చిన శ్రీవాణి పార్టీ మారకుండా ఉండటంతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా వైయస్ జగన్ చాలా సందర్భాలలో పుష్పశ్రీవాణి తనకు మరో చెల్లి అంటూ సంబోధించడం జరిగింది. ఇటువంటి తరుణంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రాజధాని విశాఖ కి వచ్చాక… పుష్పశ్రీవాణి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం గ్యారెంటీ అని మేధావులు అంటున్నారు.