అమరావతి: బెస్ట్ సిఎం అవుతాడనున్న వాడు కాస్తా తుగ్లక్ ముఖ్యమంత్రిగా మిగిలిపోయే సరికి శకుని మామ విజయసాయిరెడ్డి మైండ్ పోయిందని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ట్విట్టర్ వేదికగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు.
తుగ్లక్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని గమనించి రాష్ట్రం వదిలి ఢిల్లీకి పారిపోయారా అని బుద్దా ప్రశ్నించారు. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం అని డబ్బా కొట్టుకుంటూ తమ కార్యకర్త వాలంటీర్లతో సాధించింది ఏంటో చెప్పగలవా అంటూ విజయసాయిరెడ్డిని బుద్దా ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో తాను ఒక్క సారి గ్రామాల్లో అడుగుపెట్టి చూస్తే మబ్బులు విడిపోవడం ఖాయమని బుద్దా పేర్కొన్నారు.