అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా ని ఏమాత్రం విడిచి పెట్టడం లేదు. కరోనా వైరస్ ప్రపంచంలోకి వచ్చిన నాటి నుండి ఏదో రీతిలో చైనా ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు ట్రంప్. కరోనా వైరస్ చైనా యొక్క సృష్టి. ఇది చైనా వైరస్ అంటూ కామెంట్ చేస్తూ ఉన్న ట్రంప్ అమెరికాలో చైనా కంపెనీలకు షాక్ ఇస్తూ వస్తున్నారు. ఇటీవల వారం క్రితం టిక్ టాక్ పై నిషేధం విధించిన ట్రంప్ తాజాగా చైనా టెక్ దిగ్గజం ఆలీబాబా ని టార్గెట్ చేస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి అర్థమవుతోంది.
ఈ నేపథ్యంలో ఇటీవల విలేకర్ల సమావేశంలో ట్రంప్ ఆలీబాబా అమెరికాలో నిషేధించడం వంటి విషయాలపై విలేకర్ల సమావేశంలో షాకింగ్ కామెంట్ చేశారు. చైనా కి చెందిన చాలా దిగ్గజ కంపెనీలను నిషేధిస్తూ వరుస బెట్టి ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. మరోపక్క అమెరికాకి చెందిన ఆపిల్, ఫోర్డ్, వాల్మార్ట్, డిస్నీ వంటి పలు కంపెనీలు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను ఖండించాయి.
మొత్తంమీద చూసుకుంటే ఎన్నికలు దగ్గరయ్యే కొలది చైనా ని టార్గెట్ చేస్తూ…. ఓ స్ట్రాటజీ తో ట్రంప్ ముందుకు వెళ్తున్నట్లు అర్థమవుతుంది. ఈ విధంగానే భారత ప్రభుత్వం కూడా వ్యవహరించింది. ఎప్పుడైతే లడక్ సరిహద్దు ప్రాంతం వద్ద గాల్వాన్ లోయలో భారత సైనికులను చైనా ఆర్మీ చంపేయడం జరిగింది. దీంతో ఇండియాలో ఒక్కసారిగా చైనా పై వ్యతిరేకత రావటంతో కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్స్ పై నిషేధం విధించడం జరిగింది. ఇదే రీతిలో ప్రపంచంలో చాలా దేశాలు చైనా కంపెనీలను నిషేధిస్తూ వస్తున్నాయి.