NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

టీడీపీ – కాంగ్రెస్ పార్టీకి… 23 కీ లింకేంటి..??

 

చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న తెలుగుదేశం పార్టీకి, సోనియా గాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్య ఒక అంకెతోనూ లింగ్ ఏర్పడింది. అదేంటి చంద్రబాబుకు, కాంగ్రెస్ పార్టీకి గతం నుండి లింక్ ఉంది కదా ఇప్పుడు కొత్తగా లింకేంటి అనుకుంటున్నారా అదీ తెలుసుకుందాం. గడచిన ఎన్నికలకు ముందు ఎన్ డి ఎ నుండి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మోదీపై పెద్ద యుద్ధమే చేసిన విషయం తెలిసిందే కదా. జాతీయ స్థాయిలో మోది హవా తగ్గిపోయిందని, కేంద్రంలో ఇక రాబోయేది కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వమేనని తాను ఇక జాతీయ స్థాయిలో చక్రం తిప్పవచ్చు అనుకుంటూ చంద్రబాబు నాడు రాహుల్ గాంధీతో చెెట్టాపట్టాుల వేసుకొని తిరిగారు కదా.

 

ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో బిజెపికి వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. అయితే వారి అంచనాలు తల్లకిందులు అయ్యాయి. 2019 ఎన్నికల్లో మోడి నేతృత్వంలోని బిజెపి అఖండ మెజార్టీతో విజయం సాధించింది. రాహుల్ నాయకత్వం వహించిన కాంగ్రెసే్ పార్టీ జాతీయ స్థాయిలో ఘోర పరాజయాన్ని చవి చూసింది. దానికి నైతిక బాధ్యత గానో, మనస్థాపానికి గురయ్యో రాహుల్ తన పదవి ని త్యజించారు. నాడు రాహుల్ తో చెట్టాపట్టాలు వెసుకొని తిరిగిన చంద్రబాబు పార్టీ తెలుగుదేశం కూడా ఇక్కడ రాష్ట్రంలో ఘోర పరాజయం చవి చూసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 23 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే గుడ్డిలో మెల్ల అన్న సామెత మాదిరిగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించులేకపోగా ఇక్కడ మాత్రం బొటాబొటి సీట్లతో ప్రతిపక్ష హోదాను మాత్రం టిడిపి దక్కించుకున్నది. ఇది కొంత వరకు వారికి సంతోషించదగిన విషయం. ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీ నుండి టిడిపి కొంత దూరం జరిగినట్లే ఉందనుకోండి.

ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం…రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది. అది అందరూ అనుకుంటున్నదే. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజాిరిపోతుండటంతో ఆ పార్టీ సీనియర్ తీవ్ర కలత చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు. ఓ 23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు సోనియాకు లేఖ రాశారు. అయితే ఇది యాదృశ్చికంగా 23 మంది కలిసి లేఖ రాసినప్పటికీ…ఎపిలో టిడిపి వచ్చింది కూడా 23 స్థాానాలే కావడంతో ఈ అంకె విషయంలో టిడిపి, కాంగ్రెస్ లింక్ కలిసింది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి మాదిరిగానే ఇక్కడ టీడీపీ పరిస్థితి ఉండటం, కూడబలుక్కున్నట్లు 23 మందే కాంగ్రెస్ సీనియర్ లు సోనియాకు లేఖ రావడం గమనార్హం. కాంగ్రెస్ నేతల ఈ చర్య రాహుల్ గాంధీకి ఆగ్రహం తెప్పించడం, ఆ తరువాత ఆయన సీనియర్ పై నిప్పులు చెరగడం, అదే స్థాయిలో సీనియర్ లు ధీటుగా సమాధానాలు ఇవ్వడం తరువాత టీ కప్పులో తుఫాను మాదిరిగా వారంతా సర్దుకోవడం తెలిసిందే కదా.

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?