మహమ్మారి కరోనా వైరస్ ని ఎదుర్కొనే విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ దేశంలో సీనియర్ నేతలకు ఆశ్చర్యం కలిగిస్తున్న ఏపీ సీఎం జగన్, దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా మూడో స్థానాన్ని సంపాదించుకున్నారు. జూలై 15 నుండి 27 వరకు ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ గా నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రు లలో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రెండో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ ఉండగా మూడో స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిలిచారు.
ఈ నేపథ్యంలో చాలా మంది జగన్ అతి తక్కువ టైంలో ఈ రీతిలో ఆదరణ దక్కించుకోవడం చాలా సంతోషమని సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి గా ఒక్క ఏడాదిలో సీఎం జగన్ దేశంలో “ది బెస్ట్ ముఖ్యమంత్రిగా” మూడో స్థానంలో ఉండటం ఇది చాలా అభినందనీయమని వైసీపీ రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వాని పేర్కొన్నారు. ఇదే టైంలో సీఎం జగన్ భార్య వైఎస్ భారతీ రెడ్డి మా ఆయన బంగారం అన్నట్టుగా సోషల్ మీడియా లో కామెంట్ పెట్టారు. వైస్ జగన్ మూడో బెస్ట్ సీఎం గా సాధించడంపట్ల వైయస్ భారతి ట్విట్టర్లో ఈ విధంగా స్పందించారు. ఆమె ఏమన్నారంటే… “అత్యంత విలువైన పరిపాలన అందిస్తూ సకాలంలో లబ్ధిదారులకు పథకాలను అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటూ జగన్ నిత్యం ప్రజలతో మమేకమై ఉంటున్నారని పేర్కొన్నారు.
అతి తక్కువ టైమ్ లో దేశవ్యాప్తంగా మూడో టాప్ స్థానాన్ని జగన్ సాధించటం విశేషమని త్వరలోనే మొదటి స్థానంలో కూడా నిలవాలని కోరుకుంటున్నట్లు” వైయస్ భారతి రెడ్డి ట్విట్టర్లో స్పందించారు. ఇంకా వైసీపీ నాయకులు, మద్దతుదారులు కూడా జగన్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇదిలా ఉండగా పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 9వ స్థానంలో నిలవటం జరిగింది. ఏది ఏమైనా వైయస్ జగన్ అతి తక్కువ టైమ్ లోనే దేశవ్యాప్తంగా ఈ రీతిలో ఆదరణ దక్కించుకోవడం విశేషం అంటూ మేధావులు చెప్పుకొస్తున్నారు.