Janareddy: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఉత్కంఠ రేపిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఈ ఎన్నికల్లో తెరాస పార్టీకి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి సాగర్ నుంచి పోటీ చేశారు. అయితే, ఓటమి తర్వాత ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఓటమితో జానారెడ్డి …
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. అనంతరం కాంగ్రెస్ నేత జానారెడ్డి స్పందించారు. సాగర్ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని తెలిపారు.ఈ ఎన్నికల్లో తన కోసం పనిచేసిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు.తన ఆశయాలు ప్రజలకు అందితే చాలని, ఇకపై ఎలాంటి ఎన్నికల్లో కూడా పోటీ చేయనని అన్నారు. రాబోయే కాలంలో రాజకీయ విమర్శలు చేయనని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు రావాలని, పార్టీకి సలహాలు సూచలను మాత్రమే ఇస్తానని జానారెడ్డి పేర్కొన్నారు.
జానారెడ్డి సంచలన నిర్ణయం…
సాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 47శాతం, కాంగ్రెస్ కు 37శాతం ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న జానారెడ్డి ఈసారి అక్కడ విజయం సాధిస్తారని అనుకున్నారు. అలాంటిది ఓటమి పాలవడమే కాకుండా పోటీ చేయనని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకి షాకింగ్ వంటిదని అంటున్నారు. నియోజకవర్గంలో మరో నేతను తీర్చిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.