Ramanuja Sahasrabdi Utsav: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో గత పది రోజులుగా శ్రీరామానుజ సహస్రాబ్తి వేడుకలు వేడుకలు వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భక్తులకు అంకితం చేశారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్య మంత్రులు, ఇతర ప్రముఖులు ఎందరో వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సమతా మూర్తి విగ్రహంతో పాటు చుట్టూ ఏర్పాటు చేసిన 108 ఆలయాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Ramanuja Sahasrabdi Utsav: 120 కిలోల స్వర్ణమూర్తి విగ్రహా ఆవిష్కరణ
ఈ రోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొని 120 కిలోల స్వర్ణమూర్తిని లోకార్పణం చేయనున్నారు. భద్రవేదిలోని మొదటి అంతస్తులో కొలువైన స్వర్ణమూర్తి ప్రతిష్ఠాపన కోసం చినజీయర్ స్వామి నేతృత్వంలో వేలాది మంది రుత్మికులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు రాష్ట్రపతి ముచ్చింతల్ లోని జీవాశ్రమానికి చేరుకుంటారు. సమతామూర్తి కేంద్రంలో ఆలయాలు సందర్శన అనంతరం 4 గంటలకు స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు రెండు గంటల పాటు రాష్ట్రపతి ఆశ్రమంలో ఉండటంతో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1 గంట తరువాత భక్తులెవరినీ సమతామూర్తి దర్శనానికి అనుమతించమని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు తెలిపారు.
Read More: Jagan Chiranjeevi: జగన్ – చిరు భేటీ లీక్ వీడియోతో తమ్మారెడ్డి సహా హర్ట్ అయిన మెగా ఫ్యాన్స్..