News Channels: దేశంలో నిబంధనలు ఉల్లంఘించిన న్యూస్ ఛానల్స్ పై కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కొరఢా ఝులిపిస్తూ ఉంటుంది. లైసెన్సులను తాత్కాలిక సస్పెండ్ చేయడం జరుగుతుంది. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ అనధికార న్యూస్ ప్రసారాలు చేసిందనీ, నిబంధనలు తుంగలో తొక్కిందన్న అభియోగాలపై లైసెన్సును తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. గత ఏడాది 84 అన్ లైన్ న్యూస్ ఛానల్స్ ను కేంద్రం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. అంతే కాకుండా 23 న్యూస్ వెబ్ సైట్ లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. భారతదేశ సార్వ భౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రతను భంగం కలుగజేస్తున్నారన్న కారణంగా గత ఏడాది 300 పైగా యాప్స్ ను నిధించిన కేంద్రం 2021 ఐటీ రూల్స్ ని ఉల్లంఘిస్తున్నారన్న కారణంతో 22 యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ ను నిషేదించింది.
అయితే పెద్ద ఎత్తున వ్యూయర్ షిప్ ఉన్న ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ లైసెన్సు ను కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ తాత్కాలికంగా సస్పెండ్ చేశారంటూ వార్తలు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. గత ఏడాది జనవరి నెలలో కేరళలో మలయాళ వార్త ఛానల్ ‘మీడియావన్’ ను దేశ భద్రతా కారణాలతో కేంద్రం నిషేదించింది. ఆ నిషేద ఉత్తర్వులపై సదరు మీడియా సంస్థ కేరళ హైకోర్టును ఆశ్రయించగా కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించింది. దీంతో వారు సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కేంద్రం విధించిన నిషేదాన్ని రద్దు చేసింది.
ఆ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. మీడియాపై అకారణంగా నిషేదం అమలు చేస్తే పత్రికా స్వేచ్చకు విఘాతం కలుగుతుందని వ్యాఖ్యానించింది. నిషేదాన్ని సమర్దిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ చేసిన విమర్శలను దేశ వ్యతిరేక చర్యలుగా చిత్రీకరించవద్దనీ, ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్చ అత్యంత ప్రధానమని పేర్కొంది. పాలనపై వాస్తవాలు వెల్లడించే మీడియా ద్వారా పౌరులు ఒక అభిప్రాయానికి వస్తారని చెప్పింది. సరైన నిర్ణయాలు తీసుకునే ప్రజల ద్వారానే ప్రజాస్వామయ్ సరైన పథంలో ముందుకు సాగుతుందని, ఏక ధృవ పోకడలు, అభిప్రాయాలు ప్రజాస్వామ్యానికి కీడు చేస్తాయని పేర్కొంది.
PM Modi: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ను అడ్రస్ లేకుండా చేస్తాం