BJP Kishan Reddy: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీలో 119 ఎమ్మెల్యేలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 60 కాగా, కాంగ్రెస్ 64 మంది, ఒక సీబీఐ సభ్యుడు గెలిచారు. నేడు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్ గా నియమితులైయ్యారు. ఆయనతో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ నేపథ్యంలో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి .. రేవంత్ రెడ్డి సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల లోపాయికారీ ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. అందులో బాగంగానే ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ని చేశారని అన్నారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని ఏ ప్రాతిపదికన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ను చేశారని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మినా..దగ్గినా పడిపోతుందని అందుకే మజ్లిస్ ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తొందని కిషన్ రెడ్డి విమర్శించారు. . కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాటు ప్రకారం శాసనసభ గౌరవాన్ని కాలరాసిందని విమర్శించారు. మజ్లిస్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఆ పార్టీకి వ్యక్తిని ప్రొటెం స్పీకర్ ను చేసిందని అన్నారు. ప్రొటెం స్పీకర్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఇవేళ ప్రమాణ స్వీకారం చేయరని చెప్పారు. అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్ చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తొందని అన్నారు.
ఈ అంశంపై గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తర్వాతనే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని చెప్పారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఆదరించారన్నారు. ఒక్క స్థానం నుండి 8 స్థానాలకు పెరిగామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆరు శాతం నుండి 14 శాతానికి తమ ఓటు బ్యాంకు పెరిగిందన్నారు. అంతకు ముందు నూతనంగా గెలిచిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆయన సత్కరించారు.
KCR: బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసిఆర్ ఎన్నిక