KCR: బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, తాజా మాజీ సీఎం కేసిఆర్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.
బీఆర్ఎస్ అధినేత, తాజా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసిఆర్)ను ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. సీనియర్ నేత కే కేశవరావు అధ్యక్షతన కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు తెలంగాణ భవన్ లో సమావేశమై ఈ మేరకు తీర్మానం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష హోదాలో నిలిచిన సంగతి తెలిసిందే.
పార్టీ అధినేత కేసీఆర్ కు శస్త్ర చికిత్స జరిగిన కారణంగా శనివారం నాటి సమావేశానికి హజరు కావడం లేదని పార్టీ వర్గాలు తెలిపారు. ఆయన తనయుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటిఆర్ ఆసుపత్రిలో ఆయన వెంట ఉన్నందున సమావేశానికి హజరు కాలేదు. మరో ఎమ్మెల్యే పద్మారావు దైవ దర్శనాల నిమిత్తం వేరే రాష్ట్రాలకు వెళ్లిన కారణంగా ఈ సమావేశానికి రాలేదు. మిగిలిన 36 మంది ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసిఆర్ పేరును మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించగా, సీనియర్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు సమర్ధించారు. అనంతరం సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.
Telangana Ministers: తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు .. ఆ కీలక శాఖ సీఎం రేవంత్ వద్దే