Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫైనల్ దశకు చేరుకుంది. ఈ వారం మినహా నెక్స్ట్ వీక్ చివరివారం. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు ఉన్నారు. ఈ ఏడుగురు నామినేషన్ లో ఉన్నారు. అమర్, శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్, అర్జున్, ప్రియాంక, శోభ.. వీళ్లంతా నామినేషన్ లో ఉండటం జరిగింది. ఈ క్రమంలో చివరివారానికి ముందు జరిగిన ఓటింగ్ ప్రక్రియ పోటా పోటీగా సాగింది. విజేతను ప్రకటించడానికి మరో పది రోజులు ఉందనగా ఈ పోలింగ్ లో ఆడియన్స్ టైటిల్ ఎవరిదో తేల్చేసినట్టు ఓట్లు వేయడం జరిగింది. ఈ క్రమంలో హౌస్ లో ఉన్న ఏడుగురిలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కే భారీ ఎత్తున ఓట్లు పడ్డాయి. ఏకంగా 45 శాతం దాకా ప్రశాంత్ ఓట్లు రాబట్టాడు. ప్రశాంత్ తర్వాతి స్థానంలో శివాజీ ఉన్నాడు.
అనంతరం యావర్, అమర్, అర్జున్ ఉండగా.. చివరి స్థానాలలో ప్రియాంక, శోభ ఉండటం జరిగింది. చివరి వారంలో కూడా ఇదే ఓటింగ్ కొనసాగితే కచ్చితంగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కే టైటిల్ దక్కుతుందని హిస్టరీ క్రియేట్ చేసే అవకాశం ఉందని ఆడియన్స్ అంటున్నారు. సీజన్ సెవెన్ మొదలైన నాటినుండి పల్లవి ప్రశాంత్.. చాలా కంట్రోల్ గేమ్ ఆడుతున్నాడు. కౌంటర్ ఇవ్వాల్సిన టైంలో చక్కగా కౌంటర్ ఇస్తూ మరోపక్క టాస్కులలో తనదైన శైలిలో రాణిస్తున్నాడు. హౌస్ లో సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్… తన అద్భుతమైన చక్కనైన ఆటతీరుతో అందరినీ అలరించడం జరిగింది. హౌస్ లో సెలబ్రిటీల బ్యాచ్ ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ తనని టార్గెట్ చేసిన గాని అన్నిటిని తట్టుకొని ప్రశాంత్ నిలబడటం జరిగింది.
శివాజీ కూడా చాలా అద్భుతంగా ప్రశాంత్, యావర్ లపై వచ్చేవాళ్ళని డిఫెండ్ చేస్తూ.. తెలివైన గేమ్ ఆడుతూ వస్తున్నారు. తాను గెలుస్తూ ఇతరులను శివాజీ గెలిపించే విధంగా.. కంట్రోల్ గేమ్ ఆడుతున్నాడు. ఎక్కడ ఎలాంటి ట్రాప్ లో పడకుండా.. కూల్ గేమ్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో కచ్చితంగా టైటిల్ పోరు ప్రశాంత్.. శివాజీ ల మధ్య ఉంటుందని.. ఆడియన్స్ భావిస్తున్నారు. వచ్చేవారమే.. ఫైనల్ వారం కావడంతో.. దానికి ముందు ఈ వారం జరిగిన ఓటింగ్ ప్రక్రియ చాలావరకు విన్నర్ నీ డిసైడ్ చేసిందని బయట ప్రేక్షకులు భావిస్తున్నారు.